Biryani: రెస్టారెంట్‌లో బిర్యానీ తిని మహిళ మృతి.. 178 మందికి తీవ్ర అస్వస్థత!

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్‌కు వచ్చి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. స్థానిక రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలతో బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. వీరిలో కుటిలక్కడవ్‌కి చెందిన నుసైబా (56) అనే మహిళ బిర్యానీ తిన్న తర్వాత కడుపునొప్పి, వాంతులు కావడంతో..

Biryani: రెస్టారెంట్‌లో బిర్యానీ తిని మహిళ మృతి.. 178 మందికి తీవ్ర అస్వస్థత!
Food Poison
Follow us

|

Updated on: May 28, 2024 | 7:23 PM

త్రిస్సూర్, మే 28: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్‌కు వచ్చి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. స్థానిక రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలతో బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. వీరిలో కుటిలక్కడవ్‌కి చెందిన నుసైబా (56) అనే మహిళ బిర్యానీ తిన్న తర్వాత కడుపునొప్పి, వాంతులు కావడంతో ఆమెకు త్రిసూర్ మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ నుసైబా మంగళవారం మరణించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణానికి గత కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఫుడ్ పాయిజన్‌ కారణంగానే ఆమె మరణించిందంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

మరో వైపు సదరు రెస్టారెంట్‌లో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు, పంచాయతీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేరళలోని మాంసాహార రెస్టారెంట్లలో ‘కుజిమంతి’ అనే బిర్యానీ టైప్‌లో ఉండే వంటకం చాలా ఫేమస్‌. అన్నం, మాంసంతో కూడిన ఈ వంటకంతోపాటు మయోనీస్‌ వడ్డించడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత అధికారులు రెస్టారెంట్‌ను సీలు చేశారని కైపమంగళం పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.

పంచాయతీ ప్రెసిడెంట్ వినీతా మోహన్‌దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పెరింజనం, కైపమంగళం ప్రాంతాలకు చెందినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు . వీరిలో మరికొందరు కొడంగల్లు, ఇరింగలకుడలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించారు. ఆరోగ్య శాఖ , పంచాయతీ, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్‌లోని ఆహార నమూనాలను టెస్టుల నిమిత్తం ల్యాబ్‌కు తరలించాం. రెస్టారెంట్ అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. కాగా కేరళ ప్రభుత్వం ఫుడ్ పాయిజనింగ్ కేసుల కారణంగా 2023 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లలో గుడ్లతో తయారు చేసిన మయోనీస్‌ అనే వంటకాన్ని నిషేధించింది. అప్పట్లో అంజు శ్రీపార్వతి (20) యువతి రెస్టారెంట్‌లో మండి తిని మరణించడంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!