AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలులో ప్రయాణిస్తున్న మహిళ.. పోలీసులకు పొంతనలేని సమాధానాలు.. అనుమానంతో బ్యాగ్‌ చెక్‌ చేయగా..

దేశంలో ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా స్మగ్లర్స్ ఆగడాలు కట్టడి చేయలేకపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ప్రాంతంలో ఏదో ఒక స్మగ్లింగ్‌ జరుగుతూనే ఉంది.

రైలులో ప్రయాణిస్తున్న మహిళ.. పోలీసులకు పొంతనలేని సమాధానాలు.. అనుమానంతో బ్యాగ్‌ చెక్‌ చేయగా..
Suspicious Bag
Ravi Kiran
|

Updated on: Nov 08, 2022 | 6:06 PM

Share

దేశంలో ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా స్మగ్లర్స్ ఆగడాలు కట్టడి చేయలేకపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ప్రాంతంలో ఏదో ఒక స్మగ్లింగ్‌ జరుగుతూనే ఉంది. ఇటీవల అరుదైన బల్లులు, తాబేళ్లు, పాముల అక్రమ రవాణా ఎక్కువైపోయింది. తాజాగా రైల్లో ఓ మహిళ విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లను అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నవంబరు 6న అర్ధరాత్రి నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 52 ఏళ్ల మహిళ వీటిని ఝార్ఖండ్‌లోని టాటానగర్‌ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా పక్కా సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె వద్దనున్న బ్యాగులో 29 విషపూరిత విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తనది పూణె అని చెప్పింది. నాగాలాండ్‌లో ఓ వ్యక్తి తనకు ఈ బ్యాగ్ ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్లాలని సూచించినట్టు పోలీసులకు తెలిపింది. రైల్వే పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న పాములు, బల్లులు, సాలీళ్లను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.