AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Draupadi Murmu: జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం.. ఆ తేదీ ప్రత్యేక ఏంటో తెలుసా..?

Draupadi Murmu: కొత్తగా భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం జూలై 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ సెంట్రల్..

Draupadi Murmu: జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది  ముర్ము ప్రమాణ స్వీకారం.. ఆ తేదీ ప్రత్యేక ఏంటో తెలుసా..?
Draupadi Murmu
Subhash Goud
|

Updated on: Jul 24, 2022 | 3:55 PM

Share

Draupadi Murmu: కొత్తగా భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం జూలై 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సీజేఐ ఎన్. వి.రామన్ ఆమెతో ప్రమాణం చేయిస్తారు. దేశంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి జూలై 25ను ఎంపిక చేయడం ఇదే మొదటిసారి కాదు. వాస్తవానికి 1977 నుండి జూలై 25న ప్రమాణ స్వీకారం ప్రక్రియ ప్రారంభమైంది. తొలిసారిగా దేశ ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి జూలై 25, 1977న ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ఇదే తేదీన ఎంతో మంది రాష్ట్రపతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 25న ప్రమాణ స్వీకారం చేసిన వారిలో నీలం సంజీవరెడ్డితో పాటు జ్ఞానిజైల్‌సింగ్‌, రామస్వామి వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కె. ఆర్. నారాయణన్, APJ అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా ఈ జాబితాలో చేరనున్నారు.

జూలై 25నే ఎందుకు ఎంచుకున్నారు?

1950 జనవరి 26న డాక్టర్ రాజేంద్రప్రసాద్ దేశానికి తొలి రాష్ట్రపతి అయ్యారు. అతను మళ్లీ 1957లో మళ్లీ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొందరు రాష్ట్రపతులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు పూర్తిగా పదవీ కాలంలో ఉండలేకపోయారు. అందులో డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఉన్నారు. ఇతను అతను 13 మే 1967న ప్రమాణ స్వీకారం చేసి 1969 మే 3న మరణించాడు. దీని తరువాత 24 ఆగస్టు 1969 న వివి గిరి కొత్త అధ్యక్షుడయ్యారు. అయితే అతని తర్వాత ఈ పదవిని నిర్వహించిన ఫకృద్దీన్ అలీ అహ్మద్ అధ్యక్షుడిగా తన పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

1974 ఆగస్టు 24న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ఫకృద్దీన్ అలీ అహ్మద్ కూడా తన పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు. దీని తర్వాత, దేశానికి ఆరో రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి జూలై 25, 1977న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీకాలం పూర్తి చేశారు. అప్పటి నుంచి దేశంలోని అధ్యక్షులందరి పదవీకాలం పూర్తయింది. అందుకే ఆ తేదీని కూడా జూలై 25గా నిర్ణయించారు. చరిత్రలో ఇప్పటివరకు 9 మంది రాష్ట్రపతులు ఈ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అదే తేదీని ఎంచుకున్నారు. అయితే ఇప్పటి వరకు జూలై 25న 9 మంది ప్రమాణ స్వీకారం చేయగా, ఇప్పుడు ద్రౌపది ముర్ముతో ఆ జాబితాలో 10 మంది చేరారు.

భారత రాష్ట్రపతిని ఎవరు ఎంపిక చేస్తారు?

పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు రాజధాని ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఆర్టికల్ 58 ప్రకారం.. భారత పౌరుడు అయిన వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయవచ్చు. అలాగే అతను తప్పనిసరిగా 35 ఏళ్లు పైబడి ఉండాలి. లోక్‌సభ సభ్యుడిగా అర్హత కలిగి ఉండాలి.

జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు..

1977లో నీలం సంజీవరెడ్డి

1982లో జ్ఞానిజైల్‌సింగ్‌

1987లో రామస్వామి వెంకట్‌రమణ్‌

1992లో శంకర్‌దయల్‌ శర్మ

1997లో కేఆర్‌. నారాయణన్‌

2002లో ఏపీజే అబ్దుల్‌ కలాం

2007లో ప్రతిభాపాటిల్‌

2012లో ప్రణబ్‌ ముఖర్జీ

2017లో రాంనాథ్‌ కోవింద్‌

2022, జూలై 25న ద్రౌపది ముర్ము

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి