West Bengal: ఉప్పు నిప్పు ఒక్కటైంది.. మధ్యాహ్నం బై బైలు.. సాయంత్రం టీ భేటీ.. గవర్నర్‌, సీఎంల మధ్య కుదిరిన సయోధ్య!

వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులా ఉండే పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య సయోధ్య కుదిరినట్టే కనిపిస్తోంది. లేటెస్ట్‌ అసెంబ్లీ సీన్‌ ఇదే విషయాన్ని చెబుతోంది.

West Bengal: ఉప్పు నిప్పు ఒక్కటైంది.. మధ్యాహ్నం బై బైలు.. సాయంత్రం టీ భేటీ.. గవర్నర్‌, సీఎంల మధ్య కుదిరిన సయోధ్య!
Mamata Banerjee
Follow us

|

Updated on: Mar 08, 2022 | 9:22 AM

Mamata Banerjee With Governor Dhankhar: వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులా ఉండే పశ్చిమ బెంగాల్‌(West Bengal) గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య సయోధ్య కుదిరినట్టే కనిపిస్తోంది. లేటెస్ట్‌ అసెంబ్లీ(Assembly) సమావేశాల సందర్భంగా జరిగిన సీన్‌ ఇదే విషయాన్ని చెబుతోంది.గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, స్పీకర్ బిమన్ బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య సోమవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో ముగ్గురి మధ్య చక్కటి ట్యూనింగ్ జరిగింది. గవర్నర్ ప్రసంగం సమయంలో, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయడంతో మమతా బెనర్జీ రాజ్‌భవన్‌(Raj Bhavan)కు చేరుకుని గవర్నర్‌ను కలిశారు. అయితే దీని తర్వాత అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తనను అడ్డుకున్నారని ధన్‌కర్ ఆరోపించారు. మరోవైపు సాయంత్రం వేళల్లో గవర్నర్‌ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌కు పాదయాత్ర చేశారు.

ఉప్పు నిప్పులా ఉండే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ చాలాకాలం తర్వాత కలుసుకున్నారు. బెంగాల్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి, గవర్నర్‌ బైబై చెప్పుకున్నారు. ఆ తర్వాత నిన్నటి గవర్నర్‌ ఆహ్వానం మేరకు సీఎం మమతా బెనర్జీ రాజ్‌భవన్‌కు వెళ్లి ధన్‌కర్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయం తర్వాత దీదీలో వచ్చిన మార్పు ఇది.

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి పదే పదే అడ్డుతగిలారు బీజేపీ సభ్యులు. గవర్నర్‌ ప్రసంగాన్ని దాదాపుగా అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. బీజేపీ సభ్యుల నిరసనతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు బీజేపీ సభ్యులు. టీఎంసీ రిగ్గింగ్‌కు పాల్పడిందంటూ అసెంబ్లీ వేదికగా ఆందోళనకు దిగారు. బీజేపీ ప్రొటెస్ట్‌తో ప్రసంగం చదవకుండానే వెనుదిరగబోయారు గవర్నర్‌. ఈ క్రమంలోనే టీఎంసీ సభ్యులు వెళ్లొద్దంటూ గవర్నర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీఎం మమతాబెనర్జీ సైతం ప్రసంగాన్ని చదవాల్సిందిగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ సీఎం నమస్కారాలు పెట్టుకోవడం ఆసక్తి కలిగించింది. ఆఖరకు బీజేపీ సభ్యుల ఆందోళన మధ్యే మొదటి.. చివరి వ్యాఖ్యాలు చదివి కానిచ్చేశారు గవర్నర్‌.

గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగలడాన్ని తప్పుబట్టారు సీఎం మమతాబెనర్జీ. ఇదంతా బీజేపీ కుట్రనేనని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలని బీజేపీ యత్నిస్తోందన్నారు. అందులోనే భాగంగానే గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోబోయారని విమర్శించారు.

అంతకుముందు సోమవారం, శాసనసభ బడ్జెట్ సమావేశాలు మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్ సకాలంలో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన రాకముందే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ఉన్నారు. స్పీకర్ బిమన్ బెనర్జీ కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు వెలుపల నిలబడి ఉన్నారు. గవర్నర్ వాహనం అసెంబ్లీ గేటు వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి, స్పీకర్ ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ విగ్రహానికి ముగ్గురూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లారు. గవర్నర్ కూడా ఆనందంగా కనిపించడంతో ముగ్గురి ముఖాల్లో నవ్వు, చిరునవ్వు. ఈక, లోపల పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపించింది. బిజెపి ఎమ్మెల్యేల నిరసనలు, నినాదాల మధ్య ఆమె ఇంటి నుండి నిష్క్రమించడానికి ప్రయత్నించినప్పుడు, తృణమూల్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా మహిళా సభ్యులు ఆమె చుట్టూ నిలబడి బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read Also…  Viral Video: వేదికపైనే పెళ్లి కూతురిని చితకబాదిన వరుడు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే