AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: శ్రావణం సందర్భంగా శివయ్య క్షేత్రంలో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం.. మాంసాహారం అమ్మితే ఎఫ్ఐఆర్ నమోదు

శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో చాలా మంది తామసిక ఆహారానికి దూరంగా ఉంటారు. ఈ నేపధ్యంలో ప్రాముఖ్య ఆధ్యాత్మిక క్షేత్రం కాశీలో మటన్, చికెన్, చేపల అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైనా వీటిని అమ్మడానికి దుకాణం తెరిస్తే FIR నమోదు చేయనున్నారు. ఈ మేరకు కాశి మున్సిపల్ కార్పొరేషన్‌లోని నాలుగు ప్రధాన విభాగాలను అప్రమత్తం చేశారు.

Varanasi: శ్రావణం సందర్భంగా శివయ్య క్షేత్రంలో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం..  మాంసాహారం అమ్మితే ఎఫ్ఐఆర్ నమోదు
Varanasi
Surya Kala
|

Updated on: Jul 13, 2025 | 8:01 AM

Share

శివయ్య నివాసం కాశీ క్షేత్రం. ఈ శ్రావణ మాసంలో మాంసాహార రహిత వారణాసి కోసం మినీ హౌస్ ఒక ప్రతిపాదనను ఆమోదించింది. శ్రావణ మాసంలో మున్సిపల్ కార్పొరేషన్ సరిహద్దు ప్రాంతంలో మాంసం, చికెన్, చేపల దుకాణాలు పూర్తిగా మూసివేయబడతాయని మినీ హౌస్ సభ్యుడు హనుమాన్ ప్రసాద్ ఈ ప్రతిపాదనను సమర్పించారు. ఎవరైనా నాన్-వెజ్ అమ్మడానికి ప్రయత్నిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది.

వారణాసి మేయర్ అశోక్ తివారీ ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని.. శ్రావణ మాసంలో మాంసాహార అమ్మకాలను 100 శాతం నిషేధించాలని, ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వును 100 శాతం పాటిస్తామని జంతు సంక్షేమ అధికారి సంతోష్ పాల్ తెలిపారు.

ఈ చట్టం కింద కేసు నమోదు చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఎవరైనా దుకాణం తెరిస్తే నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసి, జప్తుకు చర్యలు తీసుకుంటామని జంతు సంక్షేమ అధికారి తెలిపారు. మినీ హౌస్ సభ్యుడు సుశీల్ గుప్తా దేవాలయాల చుట్టూ ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించాలని ప్రతిపాదించారు.

వస్త్ర సంచుల పంపిణీకి సూచనలు

ప్లాస్టిక్ బ్యాగ్స్ వడక నిషేధంపై మేయర్ స్పందిస్తూ ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించి.. గుడ్డ సంచులను పంపిణీ చేయాలని ఆదేశించారు. గత సంవత్సరం నిర్వహించిన చెట్ల పెంపకంలో జీవించి ఉన్న చెట్ల గురించి మేయర్ అశోక్ తివారీ సమాచారం కోరగా.. జాయింట్ సిటీ కమిషనర్ మొత్తం 8 వేల చెట్లను నాటిన వాటిలో 6330 చెట్లు జీవించి ఉన్నాయని తెలియజేశారు. జీవించి ఉన్న అన్ని చెట్లను జియోట్యాగ్ చేసి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని మేయర్ ఆదేశించారు.

నాలుగు ప్రధాన విభాగాలు అప్రమత్తం

శ్రవణ మాసంలో మున్సిపల్ కార్పొరేషన్‌లోని నాలుగు ప్రధాన విభాగాలు, ఆరోగ్యం, నీటి సరఫరా, విద్యుత్, సాధారణ శాఖలను అప్రమత్తం అయ్యాయి. అలాగే ఈ విభాగాల అధిపతులు QRTని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమాచారం అందిన 40 నిమిషాల్లో రోడ్డు, మురుగునీరు, శుభ్రత, తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరించడం ఈ విభాగాల పని.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
జస్ట్ నీళ్లేగా అనుకునేరు.. పవర్‌హౌస్.. ఉదయాన్నే తాగితే..
జస్ట్ నీళ్లేగా అనుకునేరు.. పవర్‌హౌస్.. ఉదయాన్నే తాగితే..