AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సీటు విషయంలో ఎమ్మెల్యేతో వివాదం.. వందే భారత్‌ ప్రయాణికుడిపై అనుచరుల దాడి.. వీడియో వరైల్!

ఏంటీ ఎమ్మెల్యే అడిగినా సీటు మారేందును నిరాకరిస్తావా అంటూ ఓ ప్రయాణికుడిపై ఆ ఎమ్మెల్యే అనుచరులు రక్తం వచ్చేలా దాడి చేశారు. ఈ దారుణ ఘటన గురువారం దిల్లీ నుంచి భోపాల్‌ వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో వెలుగు చూసింది. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. రైల్వే పోలీసులు కొట్టిన వాళ్లపై కాకుండా.. కొట్టించుకున్న వ్యక్తిపై కేసు పెట్టడం.

Viral Video: సీటు విషయంలో ఎమ్మెల్యేతో వివాదం.. వందే భారత్‌ ప్రయాణికుడిపై అనుచరుల దాడి.. వీడియో వరైల్!
Vandebharath
Anand T
|

Updated on: Jun 24, 2025 | 5:47 AM

Share

ఓ ప్రయాణికుడు సీటు మారేందుకు నిరాకరించాడని కొందరు వ్యక్తులు అతన్ని చితకొట్టిన ఘటన ఢిల్లీ నుంచి భూపాల్ వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో గురువారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివరాళ్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఓ ఎమ్మెల్యే గత వారం తన సొంత నియోజకవర్గానికి కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్‌లో వెళ్తున్నారు. అయితే ట్రైన్‌లో ఎమ్మెల్యే ఫ్యామిలీ మొత్తానికి టికెట్స్‌ ఒకే దగ్గర దొరలేదు.. భార్య, కుమారుడికి ఓ కంపార్ట్‌మెంట్‌లో సీటు దొరకగా.. ఎమ్మెల్యేకి మరో చోట సీటు కేటాయించబడింది. అయితే తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణించాలనుకున్న ఆ ఎమ్మెల్యే వాళ్ల పక్కనున్న ఓ ప్రయాణికుడిని సీటు మారమని కోరగా.. అందుకు ఆ ప్రయాణికుడు నిరాకరించాడు. దీంతో చేసేదేమి లేక ఎమ్మెల్యే పక్కకు వెళ్లారు.

అయితే ట్రైన్‌ తర్వాత స్టేషన్‌కు రావడంతో అక్కడ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు ట్రైన్‌లోకి ఎక్కారు. ఎమ్మెల్యే, ఒక దగ్గర వాళ్ల ప్యామిలీ ఒక దగ్గర ఉండడం చూసి విషయం తెలుసుకున్నారు. వెంటనే ఆ ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి అతనిపై దాడి చేశారు. అతన్ను రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో ఆ ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ముక్కులోంచి రక్తం వచ్చింది. ఘ‌ట‌న‌పై ఝాన్సీ ఎస్పీ విపుల్ కుమార్ శ్రీవాత్సవ్ కేసు బుక్ చేసి విచార‌ణ మొలుపెట్టారు.

సీట్లు విష‌యంలో కారణంగా ఈ గొడ‌వ జ‌రిగిన‌ట్లు ఆయ‌న గుర్తించారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా తగు చ‌ర్యలు తీసుకుంటానని చెప్పారు. అయితే ఎమ్మెల్యేపై సదరు ప్రయాణికుడు ఫిర్యాదు చేసేందుకు వెనక్కి తగ్గగా.. ఎమ్మెల్యే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్సీఆర్ కేసు బుక్ చేశారు పోలీసులు, అయితే ఫ్యామిలో కలిస ప్రయాణిస్తున్న స‌మ‌యంలో.. తోటి ప్రయాణికుడు త‌న కుటుంబంతో దురుసుగా ప్రవ‌ర్తించిన‌ట్లు ఎమ్మెల్యే త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సదురు ప్రయాణికుడిపై ఝాన్సీలోని గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..