AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rani Lakshmi Bai Yojana: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతిభావంతులైన అమ్మాయిలకు స్కూటీలు..!

బాలికల విద్యను ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు రాణి లక్ష్మీ బాయి స్కూటీ పథకం. దీని కింద, ఉన్నత విద్య కోసం ఆశావహులైన బాలిక విద్యార్థులకు స్కూటీలు అందిస్తారు. ఈ పథకానికి 400 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారు. స్కూటర్ ఇవ్వడం వల్ల అమ్మాయిలు చదువు కొనసాగించడానికి సహాయపడుతుంది.

Rani Lakshmi Bai Yojana: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతిభావంతులైన అమ్మాయిలకు స్కూటీలు..!
Rani Lakshmi Bai Scooty Yojana
Balaraju Goud
|

Updated on: Feb 22, 2025 | 11:31 PM

Share

జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో మహిళల్లో బాలికల సంఖ్య కూడా చాలా ఎక్కువ. యూపీలోని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం చదువుకునే అమ్మాయిల కోసం వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది.

ఇటీవల, ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ బాలికల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. చదువకునే బాలికలకు ఉచితంగా స్కూటీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం పేరు రాణి లక్ష్మీబాయి స్కూటీ పథకం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ప్రత్యేక బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే బాలికలకు వర్తిస్తుంది. నేటికీ ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. ఈ ప్రభుత్వ పథకం వారి చదువులను కొనసాగించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.

రాణి లక్ష్మీబాయి స్కూటీ పథకం కింద 12వ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన బాలికలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా స్కూటీలను అందించనుంది. యూపీ బోర్డుతో పాటు, సీబీఎస్ఈ బోర్డు కూడా ఇందులో ఉంటుందని ప్రభుత్వం తెలియజేసింది. “గ్రామీణ ప్రాంతాల్లో, చాలా మంది బాలికలు పాఠశాల తర్వాత ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడం వల్ల చదువు మానేస్తున్నారు. స్కూటీల పంపిణీ వారి విద్యను కొనసాగించడానికి సహాయపడుతుంది” అని ఒక అధికారి తెలిపారు. ఇది కాకుండా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ స్కాలర్‌షిప్ పథకం కింద ఉన్నత విద్యా శాఖ రూ. 2 కోట్లు ఇచ్చింది. ప్రతి సంవత్సరం, ఐదుగురు ప్రతిభావంతులైన బాలికలు విదేశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. చదువుకునే సామర్థ్యం ఉన్న బాలిక విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది.

దీంతో పాటు, బాలికా విద్యను ప్రోత్సహించడానికి, సహ-విద్యా వ్యవస్థతో పాటు, బాలికల హాస్టళ్ల నిర్మాణం, బాలికల సాధికారత, మీనా మంచ్, ఆత్మరక్షణ శిక్షణ, సున్నితత్వం వంటి కార్యకలాపాలు అమలు చేస్తోంది యోగి సర్కార్. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో రెసిడెన్షియల్ స్కూల్ పథకం అమలులో ఉంది. ప్రతి పాఠశాలలో 100 మంది బాలురు, 100 మంది బాలికలను చేర్చుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..