కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్కు అరుదైన గౌరవం… టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా నియామకం
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా నియమితులయ్యారు.
Union minister Anurag Singh Thakur : కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా నియమితులయ్యారు. అంతకుముందు లెఫ్టినెంట్గా పనిచేస్తున్న ఆయనకు బుధవారం పదోన్నతి కల్పిస్తూ ఈ గౌరవ డిగ్రీ లభించింది. 2016 సంవత్సరంలో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్గా చేశారు. పదోన్నతి పొందినవారిలో టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్ డిగ్రీ పొందిన మొదటి ఎంపి, మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కావడం విశేషం. ఎంపిగా సైన్యంలో చేరిన ఆయన, రెగ్యులర్ కమిషన్డ్ ఆఫీసర్గా కెప్టెన్గా మారారు. కెప్టెన్ అయ్యాడనే వార్త అందుకున్న తరువాత, ఆయనను అభినందించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ఘనత వల్ల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజల గౌరవం పెరుగుతుందని బిజెపి కార్యకర్తలు తెలిపారు. రాజకీయాలు, క్రీడలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు సైన్యంలో గౌరవ డిగ్రీలు ఇవ్వడం అనాయితీ. ఇందులో భాగంగానే ఆయన ఈ గౌరవం దక్కింది.
#WATCH MoS Finance & Corporate Affairs Anurag Thakur becomes the first serving (BJP MP in current government) and Minister to become Captain in the Territorial Army as a regular commissioned officer.
He was commissioned into the TA in July 2016 as a Lieutenant. pic.twitter.com/r7pbiAM1dL
— ANI (@ANI) March 10, 2021
ఇదిలావుంటే, ఇక ఇప్పటివరకు వివిధ రంగాల్లో నిష్ణాతులైవారిని భారత ఆర్మీ గౌరవించింది. భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిలకు కూడా ఆర్మీ గౌరవ డిగ్రీలు ప్రదానం చేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పారాచూట్ రెజిమెంట్ (106 పారా టిఎ బెటాలియన్) టెరిటోరియల్ ఆర్మీ యూనిట్లో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంక్ పొందుతున్నారు. 2011 సంవత్సరంలో ఆయనకు ఈ గౌరవం లభించింది. ఆయనతో పాటు భారత షూటర్ అభినవ్ బింద్రా, భారత్ తరఫున తొలి ఒలింపిక్ బంగారు పతకం సాధించిన దీపక్ రావులకు కూడా గౌరవ డిగ్రీలు లభించాయి. టెరిటోరియల్ ఆర్మీ భారత సైన్యంలో ఒక యూనిట్. ఇందులో 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు గల పౌరులు, ప్రభుత్వ ఉద్యోగాలలో పాలుపంచుకుంటున్నవారికి అవకాశం కల్పిస్తుంటారు. శారీరకంగా సామర్థ్యం కలిగి వారిని దేశ రక్షణపట్ల ఉత్సాహం ఉన్నవారికి ఇందులో అవకాశం కల్పిస్తుంటారు. టెరిటోరియల్ ఆర్మీ యుద్ధ సమయంలో ముందు వరుసకు మోహరించడానికి కూడా ఉపయోగిస్తుంటారు. టెరిటోరియల్ ఆర్మీ వాలంటీర్లకు ప్రతి సంవత్సరం ఒక సారి సైన్యం శిక్షణ ఇస్తారు. తద్వారా అవసరమైతే వారి సేవలను భారత ఆర్మీ పొందుతుంది.
1948 సెప్టెంబర్లో భారత రాజ్యాంగ సభ ఆమోదించిన టెరిటోరియల్ ఆర్మీ యాక్ట్ – 1948 ప్రకారం, 1949 అక్టోబర్లో దేశంలో టెరిటోరియల్ ఆర్మీ స్థాపించబడింది. సంక్షోభంలో అంతర్గత భద్రత బాధ్యతను స్వీకరించడం, అవసరమైనప్పుడు సాధారణ సైన్యానికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఇది స్థాపించబడింది. సాధారణ నియామక ప్రక్రియ కాకుండా, దీని ద్వారా యువతకు సైన్యంలో చేరడానికి, సేవ చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
దేశంలోని ఏ పౌరుడైనా ప్రాదేశిక సైన్యం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది భారతదేశంలోని సాధారణ పౌరులకు సైన్యంలో చేరడానికి అవకాశం ఇస్తుంది. దీనికి వయోపరిమితి 18 నుండి 42 సంవత్సరాలు, మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. సాధారణ నియామక ప్రక్రియ వలె, రిజర్వు చేసిన వర్గానికి వయోపరిమితిలో సడలింపు లేదు.
టెరిటోరియల్ ఆర్మీలో చేరడానికి, మీకు గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టెరిటోరియల్ ఆర్మీలో చేరిన తరువాత, మీకు స్వల్పకాలానికి కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుంది. తద్వారా మీరు సమర్థుడైన సైనికుడిగా మారవచ్చు. ఇందులో చేరడానికి ముఖ్య షరతు ఏమిటంటే మీరు మీ స్వంత సంపాదనను కలిగి ఉండాలి. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇది ఒక విధంగా స్వచ్ఛంద సేవ.
భారత సైన్యానికి టెరిటోరియల్ ఆర్మీ అవసరమైనప్పుడు టిఎ తన యూనిట్లను అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలో ఆపరేషన్ రక్షక్, నార్త్ ఈస్ట్ లోని ఆపరేషన్ రినో, టెరిటోరియల్ ఆర్మీ ఆపరేషన్ బజరంగ్లో చురుకుగా పాల్గొన్నాయి. టెరిటోరియల్ ఆర్మీ సైనికులు, అధికారులకు కూడా శౌర్య పురస్కారాలు, సేవా పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. Read Also… Relax Zone: రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. రైల్వే స్టేషన్లలో రిలాక్స్ జోన్.. సేద తీరేందుకు సరికొత్త సదుపాయాలు