AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit shah: దేశ వ్యాప్త పర్యటనల్లో అమిత్ షా బిజీ బిజీ.. జమ్ముకశ్మీర్ నుంచి నేరుగా ఆ రాష్ట్రానికి..

నడ్డా, షా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అస్సాం చేరుకుంటారు. అనంతరం పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. నిన్నటి వరకు రెండు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌ పర్యటించిన అమిత్‌ షా.. ఇవాళ్టి నుంచి అస్సాం రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Amit shah: దేశ వ్యాప్త పర్యటనల్లో అమిత్ షా బిజీ బిజీ.. జమ్ముకశ్మీర్ నుంచి నేరుగా ఆ రాష్ట్రానికి..
Union Home Minister Amit Shah
Sanjay Kasula
|

Updated on: Oct 07, 2022 | 9:48 AM

Share

రెండు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌ పర్యటించిన అమిత్‌ షా.. ఇవాళ్టి నుంచి అస్సాం రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల అసోం పర్యటన ప్రారంభించనున్నారు. ఇరువురు నేతలు మూడు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అసోం పర్యటనకు ముందు హోంమంత్రి అమిత్ షా కూడా గ్యాంగ్‌టక్‌లో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజ్‌భవన్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. దీని తర్వాత, గ్యాంగ్‌టక్‌లోని మనన్ భవన్‌లో కోఆపరేటివ్ డెయిరీ కాన్క్లేవ్ 2022 కార్యక్రమంలో పాల్గొంటారు. అస్సాంలో బీజేపీ కొత్త పార్టీ కార్యాలయాన్ని షా, నడ్డా ప్రారంభించనున్నారు. ఈశాన్య ప్రాంతంలో ఇది బీజేపీకి అతిపెద్ద కార్యాలయంగా చెప్పవచ్చు. 

అమిత్ షాతో కలిసి నడ్డా..

శుక్రవారం సాయంత్రం గౌహతికి చేరుకుంటారు. జేపీ నడ్డా కొన్ని సమావేశాలకు హాజరైన తర్వాత శనివారం సాయంత్రం బయలుదేరి వెళ్లగా.. షా ఆదివారం సాయంత్రం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో బాషిస్ట్ చరియాలీ ప్రాంతంలోని జాతీయ రహదారి-27పై కొత్త బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇద్దరు నేతలు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఖానాపరాలో బీజేపీ బూత్ కార్యకర్తల ర్యాలీలో నాయకులు ప్రసంగిస్తారని తెలిపారు. ఇందులో 40 నుంచి 45 వేల మంది బూత్ వర్కర్లు పాల్గొంటారని అంచనా.. ఆదివారం ఉదయం గౌహతిలోని అస్సాం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో జరిగే పలు సమావేశాల్లో అమిత్ షా పాల్గొంటారు. అమిత్ షా తన పర్యటన చివరి రోజున పోలీసు సూపరింటెండెంట్ల సమావేశానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం గోలాఘాట్ జిల్లాలోని దర్గావ్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్లనున్నారు. 

అసోం తర్వాత ఈ రాష్ట్రాల్లో..

అంతకుముందు హోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు. అక్కడి నుంచి నేరుగా అసోం చేరుకుంటారు. అసోం తర్వాత అమిత్ షా అక్టోబర్ 11న బీహార్‌లో పర్యటించనున్నారు. జయప్రకాశ్ నారాయణ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. దీని తర్వాత అక్టోబర్ 16న అమిత్ షా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉంటారు. అదే సమయంలో అక్టోబర్ 18న హిమాచల్ ప్రదేశ్, 20న గుజరాత్, 29న అమిత్ షా పంజాబ్ లో పర్యటించనున్నారు. దీని తర్వాత కేరళలో పర్యటన ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..