AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో రెండు రోజుల్లో UMEED పోర్టల్‌ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! ఏంటీ ఉమీద్‌ పోర్టల్‌..?

కేంద్ర ప్రభుత్వం జూన్ 6న UMEED పోర్టల్ ప్రారంభించనుంది. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఆరు నెలల్లోపు నమోదు పూర్తి చేయాలని లక్ష్యం. నమోదులో ఆలస్యమైన ఆస్తులకు పొడిగింపు ఇవ్వబడుతుంది. కానీ, నిర్ణీత సమయం తర్వాత నమోదు కాని ఆస్తులు ట్రిబ్యునల్‌కు పంపబడతాయి.

మరో రెండు రోజుల్లో UMEED పోర్టల్‌ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! ఏంటీ ఉమీద్‌ పోర్టల్‌..?
Pm Modi And Waqf
SN Pasha
|

Updated on: Jun 03, 2025 | 2:02 PM

Share

కేంద్ర ప్రభుత్వం జూన్ 6న UMEED పోర్టల్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ, అండ్ డెవలప్‌మెంట్)ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ పోర్టల్ వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేస్తుందని, దీనిని ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పారదర్శకతను ప్రోత్సహించడానికి ఈ పోర్టల్ తెస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సాంకేతిక లేదా ఇతర ముఖ్యమైన కారణాల వల్ల నిర్ణీత గడువులోపు నమోదు కాని వక్ఫ్ ఆస్తులకు ఒకటి నుండి రెండు నెలల వరకు పొడిగింపు మంజూరు చేయవచ్చు. అయితే, అనుమతించబడిన సమయం కంటే ఎక్కువ కాలం నమోదు కాని ఆస్తులను వివాదాస్పదంగా పరిగణించి, పరిష్కారం కోసం వక్ఫ్ ట్రిబ్యునల్‌కు పంపనున్నారు.

దేశం అంతటా ఉన్న అన్ని వక్ఫ్ ఆస్తులు ఈ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆస్తుల గుర్తింపు కోసం ఎన్నికల సంఘం డేటాను ఉపయోగించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర వక్ఫ్ బోర్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తుందని, నిర్ణీత గడువులోపు నమోదు చేయని పోరోపెర్టీలను వివాదాస్పదంగా పరిగణించి ట్రిబ్యునల్‌కు పంపుతారు. గత నెలలో వక్ఫ్ చట్టం 1995లోని కొన్ని నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది. ఈ మేరకు వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ద్వారా సవరించబడింది. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం 1995 వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో పాటు ఈ పిటిషన్‌ను ట్యాగ్ చేసింది.

1995 చట్టాన్ని సవాలు చేస్తూ నిఖిల్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. విచారణ సందర్భంగా 2025లో 1995 చట్టాన్ని ఎందుకు సవాలు చేస్తున్నారో చెప్పమని పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. 2013 వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా తాను సవాలు చేస్తున్నానని ఉపాధ్యాయ్ బదులిచ్చారు. దీనికి CJI, “అప్పుడు కూడా, 2013 నుండి 2025 వరకు. 12 సంవత్సరాలు. ఆలస్యం ఉంది” అని అన్నారు. 1991 ప్రార్థనా స్థలాల చట్టం, 1992 జాతీయ మైనారిటీ కమిషన్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ఇప్పటికే విచారిస్తోందని న్యాయవాది సమర్పించారు. కేంద్రం తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ధర్మాసనం దృష్టికి తీసుకువెళుతూ.. 1995 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు ఈ కొత్త పిటిషన్‌ను విచారించడానికి కోర్టు అనుమతించలేదని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..