Tamil Nadu: వారిద్దరూ మద్యం వల్లే చనిపోయారనుకున్నారు.. పోస్ట్‌మార్టంలో సినిమాను మించిన ట్విస్ట్..

తమిళనాడులో ఇద్దరు వ్యక్తుల మరణం సంచలనంగా మారింది. తొలుత వారిద్దరూ మద్యం తాగడం వల్లే చనిపోయారనుకున్నారు. కానీ, పోస్ట్‌మార్టంలో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ రిపోర్ట్ చూసి.. ఇంతటి దారుణానికి ఒడిగిట్టిందెవరో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇంతరీ ఆ ఇద్దరు ఎలా చనిపోయారు? పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెలుగు చూసిన సంచలన నిజాలు ఏంటి? అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Tamil Nadu: వారిద్దరూ మద్యం వల్లే చనిపోయారనుకున్నారు.. పోస్ట్‌మార్టంలో సినిమాను మించిన ట్విస్ట్..
Liquor Drinking
Follow us

|

Updated on: May 22, 2023 | 9:44 AM

తమిళనాడులో ఇద్దరు వ్యక్తుల మరణం సంచలనంగా మారింది. తొలుత వారిద్దరూ మద్యం తాగడం వల్లే చనిపోయారనుకున్నారు. కానీ, పోస్ట్‌మార్టంలో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ రిపోర్ట్ చూసి.. ఇంతటి దారుణానికి ఒడిగిట్టిందెవరో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇంతరీ ఆ ఇద్దరు ఎలా చనిపోయారు? పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెలుగు చూసిన సంచలన నిజాలు ఏంటి? అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడులో ప్రభుత్వ మద్యం షాపులో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, వారిద్దరూ కల్తీ మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంతో మద్యం షాపును ధ్వంసం చేశారు ప్రజలు. అయితే, రంగంలోకి దిగిన అధికారులు.. మద్యం షాపును సీజ్ చేశారు. షాపు సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు పోలీసులు.

మరోవైపు చనిపోయిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన నిజాలు వెలుగు చూశాయి. వారు చనిపోయింది మద్యం తాగడం వల్ల కాదని, మద్యంలో సైనైడ్ కలపడంతోనే వారిద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. దాంతో ఇది ప్రమాదం కాదని, పక్కాన్ ప్లాన్‌తో చేసిన మర్డర్ అని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సైనైడ్ కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. మద్యంలో అసలు సైనైడ్ కలిపింది ఎవరు? ఇద్దరిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? అని ఆరా తీస్తున్నారు పోలీసులు. విచారణను వేగవంతం చేసి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..