AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangasagar Mela: పుణ్యస్నానాలకు వెళ్లి బంగాళాఖాతంలో చిక్కుకుకున్న 511 మంది భక్తులు.. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం..

మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన 500లకుపైగా భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. ఆదివారం (జనవరి 15) రాత్రంతా దట్టమైన మంచులో అక్కడే..

Gangasagar Mela: పుణ్యస్నానాలకు వెళ్లి బంగాళాఖాతంలో చిక్కుకుకున్న 511 మంది భక్తులు.. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం..
Gangasagar Mela
Srilakshmi C
|

Updated on: Jan 17, 2023 | 12:11 PM

Share

మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన 500లకుపైగా భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. ఆదివారం (జనవరి 15) రాత్రంతా దట్టమైన మంచులో అక్కడే గడిపారు. వారిని పరిరక్షించేందుకు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 600 మంది భక్తులతో రెండు పడవలు 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. పైగా అక్కడ దట్టమైన పొగమంచు కారణంగా శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు ద్వీపానికి నౌకల రాకపోకలు నిలిపివేశారు.

కాక్‌ద్వీప్‌కు చేరుకోగానే భక్తులతో నిండి ఉన్న రెండు పడవలు బంగాళాఖాతం బురదలో దట్టమైన పొగమంచు, గాలి కారణంగా కూరుకుపోయాయి. దీంతో యాత్రికులు రాత్రంతా సముద్రంలో గడపాల్సి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వెంటనే భక్తుల పరిరక్షణ చర్యలు చేపట్టింది. సముద్రంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు తీరప్రాంతం వెంబడి మోహరించి, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. తాజా నివేదికల ప్రకారం భక్తులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం ఉదయం 10 గంటల సమయానికి 511 మంది యాత్రికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించింది.

కాగా హుగ్లీ నది-బంగాళాఖాతం సంగమం దగ్గర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా 51 లక్షల మంది భక్తులు గంగా సాగర్‌ను సందర్శించి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా దాదాపు 10 లక్షల మంది భక్తులు స్నానాలాచరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.