AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Karnataka Summit: సౌత్‌ అభివృద్ధిలో కర్నాటకది పెద్దన్న పాత్ర.. కర్నాటక స్టేట్‌ సమ్మిట్‌లో TV9 ఎండీ బరుణ్‌దాస్‌

దక్షిణ భారతదేశం అభివృద్ధి చెందడంలో కర్నాటక పెద్దన్న పాత్ర పోషించిందన్నారు. భిన్నత్వం, సంస్కృతి, ఏకత్వంతో కర్ణాటక ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తన అనుభవం ప్రకారం, దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా కర్నాటక వేరే ఊరులా అనిపించదన్నారు. 40 ఏళ్లుగా ఐటీ రంగంలో దిగ్గజంగా ఎదుగుతోందని, స్టార్టప్‌లకు అడ్డాగామారిందన్నారు. కర్నాటకను మోడల్...

TV9 Karnataka Summit: సౌత్‌ అభివృద్ధిలో కర్నాటకది పెద్దన్న పాత్ర.. కర్నాటక స్టేట్‌ సమ్మిట్‌లో TV9 ఎండీ బరుణ్‌దాస్‌
TV9 CEO Barun Das
Narender Vaitla
|

Updated on: Sep 15, 2023 | 3:16 PM

Share

బెంగళూరు, సెప్టెంబర్ 15: కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీవీ9 కన్నడ ఛానెల్ బెంగళూరులోని హోటల్ లలిత్ అశోక్‌లో ‘కనసిన కరుణాదు, కర్ణాటక స్టేట్ సమ్మిట్ 2023’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. సీఎం సిద్ధరామయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మాట్లాడిన టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ ముందుగా సిద్ధరామయ్య ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశం అభివృద్ధి చెందడంలో కర్నాటక పెద్దన్న పాత్ర పోషించిందన్నారు. భిన్నత్వం, సంస్కృతి, ఏకత్వంతో కర్ణాటక ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తన అనుభవం ప్రకారం, దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా కర్నాటక వేరే ఊరులా అనిపించదన్నారు. 40 ఏళ్లుగా ఐటీ రంగంలో దిగ్గజంగా ఎదుగుతోందని, స్టార్టప్‌లకు అడ్డాగామారిందన్నారు. కర్నాటకను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో బెంగళూరు, మైసూర్‌లు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. కర్నాటక అభివృద్ధికి పేరుగాంచింది. కర్నాటక భవిష్యత్తు తరానికి ఇదొక మంచి వేదిక అన్నారు.

తయారీ రంగంలో కర్నాటక పోటీగా ఉంది. తయారీ రంగంలో కర్నాటక సహకారం గణనీయంగా ఉంది. ఈ రంగం ఇప్పటికే దేశ జీడీపీకి చాలా దోహదపడింది. కర్నాటక తయారీ రంగం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే దేశ జిడిపికి రాష్ట్రం గరిష్ఠ సహకారం అందిస్తుందని నాకు నమ్మకం ఉంది. దేశ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల సాకారమైంది. భారతదేశం యొక్క మోనో ఫోడర్ ఎజెండా పురోగతి అవసరం. దేశాభివృద్ధిపై నాకు నమ్మకం ఉంది. ఇది రాష్ట్రాల సమైఖ్య వ్యవస్థతోనే సాధ్యమని గమనించాలన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో ఇది కేవలం సహకారం ద్వారానే కాకుండా సమైక్య వ్యవస్థలో పోటీ ద్వారా అమలు చేయాలని అన్నారు.

ఇక టీవీ9 నెట్‌వర్క్‌ గురించి మాట్లాడుతూ.. నేడు దేశంలో అతపెద్ద టీవీ నెట్‌వర్క్‌గా టీవీ9 ఉందన్నారు. 3500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మీడియా సంస్థల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం, అయితే చివరి రోజు మనమందరం ఒకే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. ప్రపంచ స్థాయిలో భారత్‌ ఎదుగుదలను సాధించాలనే లక్ష్యంతో అందరం ముందుకు సాగాలని చెప్పుకొచ్చారు.

ఇక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి. మేం మేనిఫెస్టోను కూడా ప్రజల ముందుంచాం. ఎన్నికల్లో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. సమాజంలో శాంతిభద్రతలను తీసుకొస్తాం. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. అధికారంలోకి వచ్చిన రోజే 5 హామీలను అమలు చేయాలని నిర్ణయించాం. జూన్‌ 11వ తేదీ నుంచి శక్తి యోజనను అమలు చేశాము. శక్తి యోజన కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందించాము’అని చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..