Most Wanted Terrorist: ఉగ్ర ఏరివేతపై భద్రతాదళాల ఫోకస్.. ఎన్​కౌంటర్​లో చిక్కిన ఎల్​ఈటీ కమాండర్

జమ్ముకశ్మీర్​లో ఉగ్ర ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల పౌరులపై ఉగ్ర దాడుల అనంతరం భారీ ఆపరేషన్‌ చేపట్టాయి భద్రతాదళాలు. ఈ స్పెషల్‌ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 11మంది ముష్కరులు హతమయ్యారు.

Most Wanted Terrorist: ఉగ్ర ఏరివేతపై భద్రతాదళాల ఫోకస్.. ఎన్​కౌంటర్​లో చిక్కిన ఎల్​ఈటీ కమాండర్
Pampore Encounter
Follow us

|

Updated on: Oct 16, 2021 | 10:03 AM

జమ్ముకశ్మీర్​లో ఉగ్ర ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల పౌరులపై ఉగ్ర దాడుల అనంతరం భారీ ఆపరేషన్‌ చేపట్టాయి భద్రతాదళాలు. ఈ స్పెషల్‌ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 11మంది ముష్కరులు హతమయ్యారు. మొత్తం 8ఎన్​కౌంటర్లలో 11మందిని మట్టుబెట్టారు. ఐతే పాంపోర్ ఎన్​కౌంటర్​లో ఎల్​ఈటీ కమాండర్ ఉమర్​​ ముస్తాక్​ ఖాందే చిక్కినట్లు వెల్లడించాయి భద్రతాదళాలు. జమ్ముకశ్మీర్ పోలీసుల టాప్​-10 వాంటెడ్​ జాబితాలో ముస్తాక్‌ ఉన్నట్లు తెలిపారు. బాఘాట్‌ శ్రీనగర్‌లో ఇద్దరు పోలీసులను హతమార్చడం సహా..పలు ఉగ్రదాడుల్లో ముస్తాక్‌ పాల్గొన్నట్టు వెల్లడించారు.

పౌరులపై ఉగ్ర దాడులతో..తాము ఈ ఆపరేషన్‌ చేపట్టామన్నారు పోలీసులు. పౌరుల రక్షణ తమ బాధ్యతని..అందుకే వరుస ఆపరేషన్లతో ముష్కరులను ఏరివేసినట్టు తెలిపారు. తప్పించుకున్న వారి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Crocodile: 13 అడుగుల భారీ మొసలిని పట్టుకున్న వేటగాడు.. కడుపులో 5 వేల ఏళ్లనాటి బాణం..