Lockdown: కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌.. నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌.. అనుమతి ఉన్నవి.. అనుమతి లేనివి..!

Lockdown: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా నమోదు కావడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి...

Lockdown: కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌.. నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌.. అనుమతి ఉన్నవి.. అనుమతి లేనివి..!
Follow us

|

Updated on: May 10, 2021 | 6:14 AM

Lockdown: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా నమోదు కావడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రం సోమవారం (నేడు) నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారమే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంపూర్ణ లాక్‌డౌన్‌ నేటి నుంచి అమల్లోకి రానుంది. అయితే సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు, ఆదివారాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలు, పార్క్‌లు, మ్యూజియం తదితరాలకు ప్రజలు వెళ్లేందుకు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో, నిబంధనలు మరింత కఠినతరం చేసేలా 6వ తేదీ నుంచి కూరగాయల మార్కెట్లు, ఇతర చిల్లర దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకే పనిచేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా సీఎం స్టాలిన్‌ జిల్లా కలెక్టర్లు, వైద్యనిపుణులతో చర్చించిన అనంతరం సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 24వ తేది తెల్లవారుజామున 4 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నిబంధనలు- నిషేధం విధించనవి

► కేంద్ర హోంశాఖ అనుమతించిన మార్గాలు తప్ప, విదేశాలకు విమానసేవలు రద్దు చేసింది. ఈ నిషేధం రాష్ట్రంలో కూడా అమలులో ఉంటుంది.

►  విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి విమానం, రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులతో సహా అందరికీ ఈ-రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. రాత్రి సమయాల్లో ప్రయాణికులు తమ టిక్కెట్లు చూపించి విమానాశ్రయానికి వెళ్లవచ్చు.

► మూడు వేల చదరపు అడుగులకు పైగా ఉన్న దుకాణాలు, వాణిజ్య కాంప్లెక్స్‌, మాల్స్‌ పనిచేసేందుకు గత నెల 26 నుంచి నిషేధం విధించారు. ఈ కాంప్లెక్స్‌లలో పనిచేసే కూరగాయలు, చిల్లర దుకాణాలపై కూడా నిషేధం విధించారు. కొన్నింటికి మధ్యాహ్నం 12 వరకు అనుతిచ్చారు.

► సంపూర్ణ లాక్‌డౌన్‌ కాలంలో మద్యం దుకాణాల మూసివేత.

► హోటల్స్‌, రెస్టారెంట్‌లలో పార్శిల్‌ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. టీ దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకే పనిచేస్తాయి.

► హోటళ్లు, లాడ్జీల్లో కొత్తగా బసచేసేందుకు అనుమతి లేదు. వ్యాపార రీత్యా వచ్చే వారు, వైద్యరంగానికి సంబంధించిన వారికి మాత్రం అనుమతి ఉంటుంది.

► ఆడిటోరియం, మైదానాలు, కమ్యూనిటీ హాళ్లలో రాజకీయపార్టీల సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్య, ఇతరత్రా కార్యక్రమాలపై నిషేధం. రాష్ట్రంలో బ్యూటీపార్లర్లు, సెలూన్లకు అనుమతి లేదు.

► సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, యోగా శిక్షణా కేంద్రాలు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, అన్ని రకాల బార్లపై నిషేధం.

► ఇది వరకే ప్రకటించిన విధంగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే అనుమతి.

► కోయంబేడు మార్కెట్‌ చిల్లర విక్రయ దుకాణాలపై విధించిన నిషేధం కొనసాగింపు.

► అత్యవసర శాఖలు, సచివాలయం, వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖలు, విపత్తుల నివారణ బృందాలు, హోంగార్డ్స్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖ, విద్యుత్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమం, మహిళాభివృద్ధి శాఖల కార్యాలయాలు మినహా మిగిలిన అన్ని శాఖల కార్యాలయాలు మూసివేత.

► ఉద్యోగులు ఆయా కార్యాలయాలకు వెళ్లేలా రవాణా వసతి ఏర్పాటు. ఈ నిషేధం కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు కూడా వర్తింపు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మూసివేత. అలాగే అన్ని బీచ్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి లేదు.

► పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణా కేంద్రాలు, వేసవి శిక్షణా తరగతుల నిర్వహణపై నిషేధం.

► జిల్లాలకు వెళ్లే, జిల్లాల్లో నడిచే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, టాక్సీలు, ఆటోల నిషేధం. వివాహాలు, అంత్యక్రియలు, ఇంటర్వ్యూలు, ఆస్పత్రులకు వెళ్లే వారు తగిన ఆధారాలతో వెళ్లేందుకు అనుమతి.

లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు..

► పాలు, దినపత్రికల వినియోగం, కొరియర్‌ సర్వీసులు, ఆస్పత్రులు, వైద్యపరీక్షల కేంద్రాలు, అంబులెన్స్‌లు, అంత్యక్రియలకు వెళ్లే వాహనాలు, సరకులు వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాలు, ఆక్సిజన్‌, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ తీసుకెళ్లే వాహనాలకు అనుమతి. వ్యవసాయ సంబంధిత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి.

► కూరగాయలు, పూలు విక్రయించే ఫుట్‌పాత్‌ దుకాణాలకు మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి.

► చిల్లర దుకాణాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి.

► మీడియా, పాత్రికేయులు యధావిధిగా పనిచేయవచ్చు.

► వివాహాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి.

► డేటా సెంటర్లు, వైద్యం, రెవెన్యూ, బ్యాంక్‌, రవాణా మరియు ఇతర అత్యవసర పనులకు అనుమతి.

► గోడౌన్లలో సరకులు ఎగుమతి, దిగుమతి, కోల్డ్‌ స్టోరేజ్‌ గోడౌన్‌లలో పనులకు అనుమతి.

► రైల్వేస్టేషన్లు, హార్బర్లు, విమానాశ్రయాలు, సరుకుల రవాణా వెళ్లే ఉద్యోగులకు అనుమతి.

► బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, బీమా సంస్థలు 50 శాతం మంది ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలి.

ఇవీ కూడా చదవండి:

COVID-19: గాలిలో కరోనా వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం వరకు ఉంటుందో తెలుసా..? మరోసారి క్లారిటీ ఇచ్చిన సీడీసీ

హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!