Kameng River: కమెంగ్ నదిలో విషం చిమ్మిన చైనా.. వేల సంఖ్యలో చేపల మృత్యువాత

ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది ఒక్కసారిగా నలుపెక్కింది.. అందులో హాయిగా జీవిస్తున్న చేపలు, పీతలు ఇలా జలచరాలు ఒక్కసారిగా ఊరిరాడక ఒడ్డుకు చేరాయి. కుప్పలు కుప్పలుగా..

Kameng River: కమెంగ్ నదిలో విషం చిమ్మిన చైనా.. వేల సంఖ్యలో చేపల మృత్యువాత
Fish Die
Follow us

|

Updated on: Oct 30, 2021 | 8:28 PM

ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది ఒక్కసారిగా నలుపెక్కింది.. అందులో హాయిగా జీవిస్తున్న చేపలు, పీతలు ఇలా జలచరాలు ఒక్కసారిగా ఊరిరాడక ఒడ్డుకు చేరాయి. కుప్పలు కుప్పలుగా చనిపోయాయి. ఆ నది కాస్తా ఇప్పుడు చనిపోయిన చేపలతో నిండిపోయింది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన చిత్రం వెలుగు చూసింది. అక్కడ కమెంగ్ నది నీరు అకస్మాత్తుగా నల్లగా మారింది. ఈ మేరకు అధికారులు శనివారం వివరాలు వెల్లడించారు. మొత్తం కర్బన ఉద్గారాలతో (టీడీఎస్) నది నీరు నల్లగా మారిందని జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు.

జిల్లా కేంద్రమైన సెప్పాలో శుక్రవారం నదిలో వేల సంఖ్యలో చేపలు చనిపోయాయని జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి (డీఎఫ్‌డీవో) హాలి తాజో తెలిపారు. చేపల మరణానికి సంబంధించి ప్రాథమిక పరిశోధనలను అధికారులు విడుదల చేశారు. నది నీటిలో TDS అధిక మోతాదులో ఉన్నాయని..  ఈ నీటిని తాగడం కాని.. చనిపోయిన చేపలను ఎవరూ తినవద్దని పేర్కొన్నారు. నది నీటిలో అధిక TDS కనిపించినందున చేపలు ఆక్సిజన్ తీసుకోలేకపోయాయని వెల్లడించారు.

నదిలో టీడీఎస్ లీటరుకు 6,800 మిల్లీగ్రాములుగా ఉందని ఇది లీటరుకు సాధారణ శ్రేణి 300-1,200 మిల్లీగ్రాముల కంటే చాలా ఎక్కువగా ఉందని ఒక నివేదికను ఉటంకించారు. చేపల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటిని తినవద్దని తాజో ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తూర్పు కమెంగ్ జిల్లా యంత్రాంగం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కామెంగ్ నదికి సమీపంలో చేపలు పట్టడం కోసం వెళ్లడం మానుకోవాలని.. చనిపోయిన చేపలను తినడం, అమ్మడం మానుకోవాలని ప్రజలకు సూచించారు.

చైనా కారణంగా..

నదిలో టీడీఎస్ పెరగడానికి చైనా కారణమని సెప్పా వాసులు ఆరోపించారు. పొరుగు దేశం చేస్తున్న నిర్మాణ పనుల వల్ల నీటి రంగు నల్లగా మారిందని ఆరోపించారు. కమెంగ్ నది నీటి రంగు అకస్మాత్తుగా మారడం.. పెద్ద సంఖ్యలో చేపలు చనిపోవడానికి గల కారణాలను అన్వేషించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సెప్పా తూర్పు ఎమ్మెల్యే తపుక్ టాకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కమెంగ్ నదిలో ఈ ఘటన ఎప్పుడూ జరగలేదని టాకు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..

Surat Sarees: చీరల వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. సూరత్‌లో పెరుగనున్న ధరలు.. ఎంత పెరుగొచ్చంటే..

PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..

Latest Articles
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..