ఇవేం పాడు పనులు.. ఏటీఎంలో అసభ్యకర పనులు చేస్తున్న ప్రేమ జంట.. పోలీసుల ఎంట్రీతో..
నిన్న మొన్నటి వరకు పార్కులు, థియేటర్లు.. లవర్స్ అడ్డా్గా ఉండేవి. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగానే ప్రేమికులు కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషించుకుంటున్నారు. ఎవరూ గుర్తుపట్టలేని ప్రాంతాల్లో...
నిన్న మొన్నటి వరకు పార్కులు, థియేటర్లు.. లవర్స్ అడ్డా్గా ఉండేవి. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగానే ప్రేమికులు కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషించుకుంటున్నారు. ఎవరూ గుర్తుపట్టలేని ప్రాంతాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బిహార్ రాజధాని పట్నాలో అలాంటి ఘటనే జరిగింది. ఆ పని కోసం ఓ ప్రేమ జంట ఏకంగా ఏటీఎం ను ఎంచుకున్నారు. అంతే కాకుండా అందులో వెళ్లి అసభ్యకరమైన పనులు చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని గమనించిన ఏటీఎం సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఏటీఎం వద్దకు చేరుకుని ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు.
బిహార్ రాజధాని పట్నాలోని కంకర్బాగ్ ప్రాంతంలోని శాలిమార్ మోర్ వద్ద.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఉంది. అయితే అందులో ఓ యువకుడు, బాలిక వెళ్లాడు. సమయం గడుస్తున్నా ఎంతకీ వారు బయటకు రాకపోవడంతో అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పోలీసులు ఏటీఎం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో యువకుడు, బాలిక అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారిద్దరినీ పోలీసులు పట్టుుకన్నారు.
వారు ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయడం గానీ, బయటకు రావడం గానీ చేయడం లేదని కంకర్బాగ్ పోలీసులు తెలిపారు. ఏటీఎంలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బ్యాంకు సెక్యూరిటీ అధికారులు అనుమానించారు. పోలీసుల విచారణలో వారిద్దరూ ప్రేమికులని, మెడికల్ విద్యార్థులని తేలింది. వారిని విచారించి, ధృవ పత్రాలు పరిశీలించిన తర్వాత విడుదల చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం