Plane Crash Video: మరణంలోనూ వీడని స్నేహం.. నేపాల్ విమాన ప్రమాదంలో ఐదుగురు ప్రాణ స్నేహితులు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ఫేస్ బుక్ లైవ్ వీడియో..

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదంలో ఐదుగురు ప్రాణ స్నేహితులు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. చివరి నిమిషంలో తమ టూర్‌ను లైవ్ చేస్తూ చనిపోయారు. అయితే, తమ సాహస యాత్ర.. చివరి యాత్రగా మారింది. వారి పారాగ్లైడింగ్ డ్రీమ్ అలానే మిగిలిపోయింది.

Plane Crash Video: మరణంలోనూ వీడని స్నేహం.. నేపాల్ విమాన ప్రమాదంలో ఐదుగురు ప్రాణ స్నేహితులు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ఫేస్ బుక్ లైవ్ వీడియో..
Nepal Plane Crash Fb Live
Follow us

|

Updated on: Jan 15, 2023 | 9:12 PM

వారంతా ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుంచి కలిసి చదవుకున్నారు. చివరి మజిలి కూడా కలిసే కొనసాగారు. అయితే ఆ క్షణం తర్వాత ఏం జరుగుతుందో ఆ ఐదుగిరికి ఎవరికి తెలియదు. కానీ వారు సంతోష సమయాలను వారు తమ మిత్రులతో ఫేస్ బుక్‌లో లైవ్ చేస్తుండగా జరిగిపోయింది. తమ టూర్ ఎలా సాగుతుందో అంతా మిగిలిన మిత్రులకు ఫేస్ బుక్ ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఇదే వారి చివరి యాత్ర అవుతుందని ఫేస్ బుక్ లైవ్ చూస్తున్న మిత్రులకు తెలియదు.. చేస్తున్న ఆ ఐదుగురికి తెలియదు. కాని మారి స్నేహం చావులో కూడా కలిసే సాగింది. వారు అగ్నికి ఆహుతైన లైవ్ మాత్రం అలానే కొనసాగింది. నేపాల్ ఖాట్మాండు నుంచి పొకారా వెళ్తున్న యెతీ ఎయిర్‌లైన్స్‌ విమానం ఘోర ప్రమాదంలో వీరంతా చనిపోయారు.

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దేశరాజధాని ఖాట్మాండు నుంచి పొకారా వెళ్తున్న విమానం ల్యాండింగ్‌ సమయంలో క్రాష్‌ అయ్యింది. విమానప్రమాదంలో 72 మంది చనిపోయారు. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ప్రమాదానికి ముందు విమానం గాలిలో చక్కర్లు కొట్టడం వీరు తమ ఫేస్ బుక్ లైవ్ వీడియో చిత్రీకరించారు. ల్యాండింగ్‌కు కేవలం 10 సెకన్లు ముందు అంటే ప్లేన్‌ క్రాష్‌  జరగడానికి సరిగ్గా ముందు కూడా వీరు వీడియో తీశారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదంలో ఘాజీపూర్‌కు చెందిన ఐదుగురు మృతి చెందారు. వారి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల పేర్లు అనిల్ రాజ్‌భర్, విశాల్ శర్మ, అభిషేక్ కుష్వాహ, సోను జైస్వాల్, సంజయ్ జైస్వాల్. ప్రమాదానికి ముందు, వారిలో ఒకరు ఫేస్‌బుక్ లైవ్ కూడా చేశారు. ఈ యువకులంతా ఘాజీపూర్‌లోని అలవ్‌పూర్ సిపా, ధార్వా గ్రామీణ యువకులు.

ప్రమాదానికి ముందు సోనూ జైస్వాల్ విమానం లోపల నుంచి ఫేస్‌బుక్‌ను లైక్ చేశారు. అదే సమయంలో విమానం కూలిపోయింది. దీని వీడియో కూడా ఇప్పుడు బయటపడింది.

ఫేస్ బుక్ లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..

పోఖారా పారాగ్లైడింగ్ కోసం వెళ్లాడు

విమాన ప్రమాదంలో ఘాజీపూర్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు పర్యాటక కేంద్రమైన పోఖారాలో పారాగ్లైడింగ్ షోలో పాల్గొనాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక పౌరుడు ఒకరు సమాచారం అందించారు. అతని సహకారంతో వారు ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ప్రమాదానికి గురైన విమానంలో ఉన్న ఐదుగురు భారతీయులను అభిషేక్ కుష్వాహ (25), విశాల్ శర్మ (22), అనిల్ కుమార్ రాజ్‌భర్ (27), సోను జైస్వాల్ (35), సంజయ్ జైస్వాల్ (35)గా గుర్తించామని యెతి ఎయిర్‌లైన్ అధికారి తెలిపారు. వీరిలో సోనూ జైస్వాల్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నివాసి. ఈ ఐదుగురిలో నలుగురు భారతీయులు శుక్రవారం నాడు భారత నుంచి ఖాట్మండు చేరుకున్నారు.

విమానంలో ఉన్న వారంతా చనిపోయారు

నేపాల్‌కు చెందిన ప్రయాణీకుల విమానం ఆదివారం పోఖారా విమానాశ్రయంలో దిగుతుండగా నది లోయలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 72 మంది చనిపోయారు. విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా మరణించారు. వీరిలో ఐదుగురు యూపీలోని ఘాజీపూర్ జిల్లా వాసులు.

జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు

ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేస్తూ, నేపాల్‌లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను. మా ఆలోచనలు బాధిత కుటుంబాలతో ఎప్పటికీ ఉంటాయి.  జైశంకర్ ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా షేర్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Latest Articles