Bharat Ratna: దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. ప్రధాని మోదీ, అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ..!

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడం తెలిసిందే. బీహార్‌కి చెందిన సోషలిస్ట్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, ధివంగత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం.

Bharat Ratna: దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. ప్రధాని మోదీ, అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ..!
NTR
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 12, 2024 | 7:45 PM

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడం తెలిసిందే. బీహార్‌కి చెందిన సోషలిస్ట్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, ధివంగత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. వీరిలో నలుగురికి మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం విశేషం. దీంతో భారతరత్న పురస్కారానికి నోచుకోని పలువురికి ఆ పురస్కారాన్ని ప్రకటించాలన్న డిమాండ్ తెరమీదకు వస్తోంది. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. అలాగే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేకి భారతరత్న ఇవ్వాలని శివసేన (యూబీటీ)కి చెందిన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన రాజ్ థాకరే డిమాండ్ చేశారు.

కాగా ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలన్న డిమాండ్ కూడా ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. పీవీకి భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తంచేసిన సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి.. ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన ఎన్టీఆర్‌కి కూడా భారతరత్న ప్రకటించి ఉంటే యావత్తు తెలుగు ప్రజానీకం పులకించిపోయేదని అన్నారు. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోందని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని కోరిన విజయశాంతి..

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎంపీ లేఖ..

కాగా ధివంగత ఎన్టీ రామారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ(టీడీపీ) కేంద్రాన్ని కోరింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా‌కు ఆ మేరకు ఆయన లేఖలు రాశారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచారని తెలిపారు.

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!