Tamilnadu: అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను శిక్షించిన భార్య.. ఏం చేసిందంటే..

తన భర్త వేరే వారితో శారీరక సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలవడంతో మరుగుతున్న వేడి నీటిని భర్త మర్మాంగం పై పోసింది. దీంతో భర్త దేహం 40 శాతం కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన భర్తని ఆసుప్రతిలో చేర్పించిన భార్య ..

Tamilnadu: అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను శిక్షించిన భార్య.. ఏం చేసిందంటే..
Boil Water (file Photo)
Follow us

|

Updated on: Aug 17, 2022 | 4:15 PM

Tamilnadu: భారతీయ సంప్రదాయంలో భార్య, భర్తల బంధం ఎంతో విలువైనది. ఇద్దరూ కలిసి సుఖ సంతోషాలతో జీవించాలనుకుంటారు. తన భర్త.. తనను తప్ప ఇంకెవరిని చూడకూడదని కోరుకుంటుంది ప్రతి భార్య.. తన భర్త వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటే తట్టుకోలేదు. ఎంతగానో నమ్మిన భార్యను మోసం చేస్తే.. ఎంతో మనోవేదనకు గురవుతారు. ఇలా తన భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేని ఓ భార్య..  తన భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ శిక్ష వేసిన ఘటన తమిళనాడులో జరిగింది. తన భర్త వేరే వారితో శారీరక సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలవడంతో మరుగుతున్న వేడి నీటిని భర్త మర్మాంగం పై పోసింది. దీంతో భర్త దేహం 40 శాతం కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన భర్తని ఆసుప్రతిలో చేర్పించిన భార్య .. ఆతర్వాత పోలీసులకు లొంగిపోయింది. తనను మోసం చేసినందుకే భర్తను శిక్షించానని చెప్పింది. రాణిపేట జిల్లా కావేరిపాకానికి చెందిన తంగరాజ్ , ప్రియా భార్య భర్తలు .వీరికి ఇద్దరు పిల్లలు. గత కొంతకాలంగా తంగరాజ్ మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. విషయాన్ని నిర్థారించుకున్న భార్య.. భర్త మర్మంగంపై మరిగుతున్న వేడి నీటిని వేసి శిక్షించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని నేర వార్తల కోసం చూడండి..