DMK: వివాదంలో మరో డీఎంకే మంత్రి! క్షమాపణలు చెప్పినా ఆగని విమర్శలు
తమిళనాడు మంత్రి దురైమురుగన్ వికలాంగుల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. దురైమురుగన్ వ్యాఖ్యలపై వికలాంగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్య మంత్రి స్టాలిన్ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్రంగా ఉన్నారని సమాచారం. మంత్రి క్షమాపణతో వివాదం కొంతవరకు తగ్గినట్లుంది.

ఇప్పటికే తమిళనాడు అటవీ శాఖ మంత్రి పొన్ముడి మహిళలు, తిలకాల విషయంలో చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో దివ్యాంగుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి దురైమురుగన్ క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే తిలకాలు, మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అటవీ శాఖ మంత్రి పొన్ముడిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చర్యలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మంత్రి దురైమురుగన్ క్షమాపణలు చెప్పడం గమనార్హం.
కొన్ని రోజుల క్రితం, తూత్తుకుడిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన దురై మురుగన్.. వికలాంగులను కించపరిచేందుకు “వికలాంగులు” అనే పదాన్ని ఉపయోగించారు. ఆయన వ్యాఖ్యలపై తమిళనాడు అసోసియేషన్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశం వివాదంగా మారడంతో ఎట్టకేలకు మంత్రి దురైమురుగన్ క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఒక బహిరంగ సభలో నేను వికలాంగులను వారి పాత పేర్లతో పిలిచానని పార్టీ నాయకుడు తలపతి నా దృష్టికి తెచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను, బాధపడ్డాను.
ఒక కళాకారుడి పెంపకంలో పెరిగిన నేను అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా పెద్ద తప్పు. నా వ్యాఖ్యలతో బాధపడిన వికలాంగులకు బేషరతు క్షమాపణలు చెబుతున్నాను. అయితే చాలా మంది మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంపై సీఎం స్టాలిన్ మంత్రులపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్టాలిన్ పదే పదే మంత్రులను మందలింనట్లు సమాచారం.
கழக பொதுச்செயலாளர் திரு.துரைமுருகன் அவர்கள் அறிக்கை!
இயற்கையிலேயே உடலில் ஏற்பட்ட குறைபாடு உடையவர்களை அருவருக்கும் பெயர் கொண்டு, அவர்களை அழைத்து வந்ததை முத்தமிழறிஞர் கலைஞர் அவர்கள் கருணை உள்ளத்தோடு “மாற்றுத் திறனாளிகள்”” என்று பெயரிட்டு அழைத்தார். அதையே நாங்களும் பின்பற்றி… pic.twitter.com/0UHBVXRg8T
— DMK (@arivalayam) April 11, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
