AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత వివరణపై సస్పెన్స్.. ఈరోజు అందుబాటులో ఉండటం లేదంటూ సీబీఐకి లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులివ్వగా.. మంగళవారం సీబీఐ అధికారులకు కవిత వివరణ ఇవ్వాల్సి..

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత వివరణపై సస్పెన్స్.. ఈరోజు అందుబాటులో ఉండటం లేదంటూ సీబీఐకి లేఖ..
Mlc Kavitha
Amarnadh Daneti
|

Updated on: Dec 06, 2022 | 7:30 AM

Share

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులివ్వగా.. మంగళవారం సీబీఐ అధికారులకు కవిత వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే తాను ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాల కారణంగా డిసెంబర్6వ తేదీ మంగళవారం హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత సీబీఐ అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. తాను విచారణకు సహకరిస్తానని, అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల 6వ తేదీ కాకుండా ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు తాను అందుబాటులో ఉంటానని పేర్కొంటూ సీబీఐ అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీబీఐ అధికారుల నుంచి రిప్లై రావల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు కవిత వివరణ తీసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత లేఖపై ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. బుధవారం జగిత్యాలలో సీఏం కేసీఆర్ సభ ఉండటంతో.. ఆ ఏర్పాట్లను పరిశీలించేందుకు కవిత మంగళవారం జగిత్యాల వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తన విచారణ తేదీల్లో మార్పులు చేయవల్సిందిగా కవిత సీబీఐ అధికారులను కోరినట్లు తెలుస్తోంది.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ, సీఏం కేసీఆర్ కుమార్తె కవితకు సిబిఐ అధికారులు డిసెంబర్2వ తేదీన 160 సీఆర్పీసీ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6వతేదీ  మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని కవిత నివాసంలోనే విచారణ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ ఇచ్చిన రాత పూర్వక పిర్యాదు ఆధారంగా  నమోదు చేసిన కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు.. మరో 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు నోటీసులో తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు కవితను కోరారు. సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ సాహి పేరుమీద ఈ నోటీసులను జారీచేయగా.. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత ప్రమేయంపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు