AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ లిస్ట్‌లో లేని ఫ్లోర్ టెస్ట్ అంశం…

మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఆయన నేడు ఫ్లోర్ టెస్టును ఎదుర్కొనేలా చూడాలని  గవర్నర్ లాల్ జీ టాండన్..

మధ్యప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ లిస్ట్‌లో లేని ఫ్లోర్ టెస్ట్ అంశం...
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 16, 2020 | 11:51 AM

Share

మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఆయన నేడు ఫ్లోర్ టెస్టును ఎదుర్కొనేలా చూడాలని  గవర్నర్ లాల్ జీ టాండన్.. స్పీకర్ ప్రజాపతికి లేఖ రాశారు. అయితే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన నిర్ణయమే తమకు శిరోధార్యమని కమల్ నాథ్ అంటున్నారు. 22 మంది రెబెల్ ఎమ్మెల్యేలను బీజేపీ బందీలుగా ఉంచిందని, అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నదే వారి ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టనివ్వండి.. అని సవాల్ చేసిన ఆయన.. తమ ప్రభుత్వం శాసన సభలో నెగ్గితీరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. వీలైతే ఫ్లోర్ టెస్ట్ ను వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. అటు-హౌస్ బిజినెస్ లిస్టులో నేడు ఫ్లోర్ టెస్ట్ అన్న అంశం లేదని తెలిసింది. కాగా-అందరి కళ్ళూ 22 మంది రెబెల్ శాసన సభ్యులపైనే ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఈ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో..ఆయనకు మద్దతుదారులైన వీరంతా ఎలాంటి చర్య చేపట్టబోతారోనని రాజకీయ పరిశీలకులు తర్జనభర్జన పడుతున్నారు.