Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Subramanian Swamy: స్వామి సంచలన కామెంట్స్.. ఆ రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించాలి..

మరోసారి బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి సంచలన ట్వీట్‌ చేశారు. త్వరలో తాలిబన్లు పాకిస్తాన్‌ను ఆక్రమించుకుని.. అఫ్గనిస్తాన్‌లో కలిపేస్తారని తెలిపారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సులకు విముక్తి కల్పించాలన్నారు.

Subramanian Swamy: స్వామి సంచలన కామెంట్స్.. ఆ రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించాలి..
Follow us
Sanjay Kasula

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 14, 2021 | 3:50 PM

మరోసారి బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి సంచలన ట్వీట్‌ చేశారు. త్వరలో తాలిబన్లు పాకిస్తాన్‌ను ఆక్రమించుకుని.. అఫ్గనిస్తాన్‌లో కలిపేస్తారని తెలిపారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సులకు విముక్తి కల్పించాలన్నారు. ఈ క్రమంలో ..సొంత దేశాలుగా ఏర్పాటు చేసే సమయం ఆసన్నమయిందన్నారు. ఈ విషయంలో పాక్‌, అమెరికా, భారత్‌ల సాయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సుబ్రమణియన్‌ స్వామి ట్వీట్‌ చేశారు. అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లకు వ్యతిరేకంగా అనేక వైమానిక దాడులను ప్రారంభించిన తర్వాత అమెరికా ఉద్దేశాల గురించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అసురక్షితంగా ఉన్నారంటూ ఓ యూజర్‌ చేసిన ట్వీట్‌కు బదులిస్తూ.. సుబ్రమణియన్‌ స్వామి ఇలా ట్వీట్‌ చేశారు.

పాకిస్థాన్ త్వరలో ‘తాలిబనైజ్డ్ ఆఫ్ఘనిస్తాన్’లో భాగమవుతుందని బిజెపి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. భారతదేశం యునైటెడ్ స్టేట్స్ సైనిక సహకారంతో పాకిస్తాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు సింధ్ ప్రావిన్సులను తమ సొంత దేశాలుగా ఏర్పరచుకోవడానికి ఇది సమయం అని  ఆయన సూచించారు.

మైక్రోబ్లాగింగ్ సైట్‌ను తీసుకొని స్వామి ట్వీట్ చేస్తూ, “పాకిస్తాన్? త్వరలో ఇది గొప్ప తాలిబనైజ్డ్ ఆఫ్ఘనిస్తాన్‌లో భాగం అవుతుందన్నారు. బలూచి, పఖ్తూనీలు, సింధీలను తమ సొంత దేశాలుగా ఏర్పరచుకునేందుకు  అమెరికా , ఇండియాతో సైనిక పొత్తు పెట్టుకునే సమయం వచ్చింది.” ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకు వ్యతిరేకంగా అనేక వైమానిక దాడులను ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికా ఉద్దేశాల గురించి అసురక్షితంగా ఉన్నారని పేర్కొన్న వినియోగదారుకు ప్రతిస్పందనగా బిజెపి నాయకుడి ట్వీట్.

ఆఫ్ఘన్ లో రాజధాని కాబూల్ నగరానికి తాలిబన్లు ఇక సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. దీంతో అమెరికా..ఈ దేశంలోని తమ ప్రజలను, బలగాలను, ఆఫ్ఘన్ ప్రజలను కూడా విమానాల ద్వారా తరలించడానికి సిద్ధపడింది. అమెరికా నుంచి మొట్టమొదటి విమానం కాబూల్ విమానాశ్రయంలో దిగింది. కాబూల్ నుంచి రోజుకు కొన్ని వేలమందిని తరలిస్తామని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మీడియాకు తెలిపారు. సుమారు 3 వేలమంది అమెరికన్ ట్రూప్స్ కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడం ప్రారంభించారని, క్రమంగా వీరి సంఖ్య పెరగవచ్చునని ఆయన చెప్పారు.

ఆ నగరాన్ని ఇతర ప్రాంతాల నుంచి వేరు చేయడానికి తాలిబన్లు యత్నిస్తున్నారని, అయితే దాన్ని పూర్తిగా వశపరచుకునేందుకు వారికి మరికొంత కాలం పట్టవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘన్ లోని తమ ప్రజలను ఖాళీ చేయించాలని కాబూల్ లోని తమ రాయబార, దౌత్య కార్యాలయాలను కోరినట్టు ఆయన చెప్పారు. ఇక బ్రిటన్,జర్మనీ, డెన్మార్క్,స్పెయిన్ దేశాలు కూడా ఆఫ్గనిస్తాన్ లోని తమ దౌత్య కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేయడం ప్రారాంభించాయి. లేదా ఆ దేశంలోని తమ ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా-లోగార్ ప్రావిన్స్ రాజధాని పుల్-ఎ-ఆలమ్ నగరాన్ని తాలిబన్లు తాజాగా ఆక్రమించుకున్నారు.కొన్ని చోట్ల స్థానిక ప్రజలు వీరికి స్వాగతం పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి: TMC – BJP: ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. తేల్చి చెప్పిన దీదీ ప్రధాన అనుచరుడు.. ఇదో కొత్త రకం గేమ్..

FAKE CHALLAN SCAM: ఏపీలో సరికొత్త నకిలీ వైరస్.. ఇది సోకితే.. రాష్ట్ర ఖజానా శంకరగిరి మాన్యాలేనట.. ఫోకస్ పెట్టిన సీఎం జగన్