‘నాలుగు ప్రశ్నలకు సమాధానమివ్వండి నిర్మలాజీ ‘! కాంగ్రెస్
బ్యాంకులకు కుచ్ఛు టోపీ పెట్టి రుణాలు ఎగగొట్టిన 50 మంది డీఫాల్టర్లలో బీజేపీ మిత్రులు ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం, దానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 13 ట్వీట్లతో కౌంటరివ్వడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని ఇంతటితో వదలడంలేదు. తాము అడుగుతున్న నాలుగు ప్రశ్నలకు సింపుల్ గా సమాధానాలు ఇవ్వాలని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మళ్ళీ బీజేపీని, ఆర్ధిక శాఖ మంత్రిని నిలదీశారు. ఫైనాన్స్ వంటి […]
బ్యాంకులకు కుచ్ఛు టోపీ పెట్టి రుణాలు ఎగగొట్టిన 50 మంది డీఫాల్టర్లలో బీజేపీ మిత్రులు ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం, దానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 13 ట్వీట్లతో కౌంటరివ్వడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని ఇంతటితో వదలడంలేదు. తాము అడుగుతున్న నాలుగు ప్రశ్నలకు సింపుల్ గా సమాధానాలు ఇవ్వాలని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మళ్ళీ బీజేపీని, ఆర్ధిక శాఖ మంత్రిని నిలదీశారు. ఫైనాన్స్ వంటి ఉన్నత శాఖకు మంత్రి పదవిలో ఉన్న మీరే సమస్యను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇది సరికాదని ఆయన ట్వీట్ చేశారు.
నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ. విజయ్ మాల్యా.. ఈ ముగ్గురి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న సొమ్ముకు ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. వీరి నుంచి 2,780.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు మీరు ట్వీట్ చేశారని, అయితే 2002 మార్చి 16 న పార్లమెంటుకు సంబంధిత మంత్రి ఇఛ్చిన సమాధానంలో.. ఈడీ,… ఫెమా, పీఎంఎల్ఎ చట్టాల కింద ఐదేళ్లలో కేవలం 96.93 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారని ఆయన గుర్తు చేస్తూ… ఇందుకు సంబంధించిన న్యూస్ కటింగ్ ను కూడా తన ట్వీట్ కి జత చేశారు. అసలు 2014..15….2019..20 మధ్య కాలంలో మోదీ ప్రభుత్వం 6,66,000 కోట్ల బ్యాంక్ రుణాలను ఎందుకు మాఫీ చేసిందని రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. ఈ నెల 24 న రిజర్వ్ బ్యాంకు ఆర్టీఐ కి ఇఛ్చిన రిప్లయ్ లో రూ.. 68,607 కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు తెలిపింది. ఇది నిజమా? కాదా ? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ , జతిన్ మెహతా, విజయ్ మాల్యాతో సహా మరికొందరి డీఫాల్టర్ల రుణాలను ప్రభుత్వం ఎందుకు మాఫీ చేసింది ? ఇందుకు ఎవరు అనుమతించారు ? అని సూర్జేవాలా సూటిగా ప్రశ్నించారు. వీటికి సమాధానాలు ఇవ్వాలని కోరారు.
To mislead or mistate facts while holding the august office of FM is most unfair @nsitharaman ji!
You tweeted that ₹2,780.50 CR have been recovered from Modi-Choksi-Mallya.
On 16th March, 2020; Parliament was told that ED has recovered only ₹96.93 CR in 5 yrs under PMLA-FEMA! pic.twitter.com/yZskWrbNhb
— Randeep Singh Surjewala (@rssurjewala) April 29, 2020
2/23. Why is Modi Govt righting off Bank Loans of absconders & fraudsters like Nirav Modi+Mehul Choksi(₹8,048 CR), Jatin Mehta(₹6,038 CR), Mallya(₹1,943 CR) & others as per RBI’s RTI reply of 24/4/2020?
4. Who permitted such huge write offs of Bank loans of defaulters & why? https://t.co/zPzPfqiJtb
— Randeep Singh Surjewala (@rssurjewala) April 29, 2020
Mehul Choksi Case : Attachments of Rs 1936.95 Crore including foreign attachment of Rs 67.9 Crore. Seizure of Rs 597.75 Crore. Red Notice issued. Extradition Request sent to Antigua. Hearing for declaration of Mehul Choksi as Fugitive Offender is in progress.
— Nirmala Sitharaman (@nsitharaman) April 28, 2020
…while private sector banks were getting out. RBI could have raised more flags about the quality of lending…” RR Rajan.(Source: @IndiaToday Sept 11,2018 and many other print& electronic media). From 2015, PSBs were asked by GoI to check all NPAs >50 crore for wilful default.
— Nirmala Sitharaman (@nsitharaman) April 28, 2020