Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బిఐ కీలక సూచన.. ఇబ్బంది పడొద్దంటే అది చేయాల్సిందేనంటూ..

SBI Alert: ఎస్‌బిఐ తన కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎస్‌బిఐ.. కస్టమర్లు తప్పనిసరిగా తమ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్...

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బిఐ కీలక సూచన.. ఇబ్బంది పడొద్దంటే అది చేయాల్సిందేనంటూ..
Sbi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 19, 2021 | 10:57 PM

SBI Alert: ఎస్‌బిఐ తన కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎస్‌బిఐ.. కస్టమర్లు తప్పనిసరిగా తమ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని అభ్యర్థించింది. ఎలాంటి అవాంతరాలు లేని సర్వీస్ పొందాలనుకుంటే.. వినియోగదారులు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించింది. ‘‘మా కస్టమర్లకు మేమిస్తున్న సలహా.. అవాంతరాలు లేని, అసౌకర్యానికి గురికాని బ్యాంకింగ్ సేవలు పొందాలంటే మీ పాన్ కార్డ్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి.’’ అని ఎస్‌బిఐ ట్వీట్ చేసింది. అంతేకాదు.. ‘‘పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి. లింక్ చేయకపోతే, పాన్ పనిచేయని/ క్రియారహితంగా ఉంటుంది. అలాగే లావేదేవీలను నిర్వహించడం కష్టతరం అవుతుంది.’’ అని పేర్కొంది.

పాన్-ఆధార్ లింక్ ఎలా చేయాలో కూడా ఎస్‌బిఐ సదరు ట్వీట్‌లో పేర్కొంది. ఆధార్-పాన్ లింక్ కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక సైట్‌లోకి వెళ్లాలని, ‘లింక్ ఆధార్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలని పేర్కొంది. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేసిన సంబంధిత వివరాలను నమోదు చేయడం ద్వారా పాన్-ఆధార్‌ను లింక్ చేసుకోవాలని సూచించింది. కాగా, పాన్-ఆధార్ లింకింగ్‌ గడువు జూన్ 30వ తేదీనే కావడంతో ఎస్‌బిఐ తన కస్టమర్లను ఇలా అలర్ట్ చేసింది.

SBI Tweet:

Also read:

Telangana Cabinet: ఏపీ ప్రాజెక్టుల‌తో తెలంగాణ‌కు అన్యాయం..రైతు ప్ర‌యోజ‌నాల కోసం ఎంత దూర‌మైనా: టీఎస్ క్యాబినేట్‌