AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: అది శుభ్రం చేయడానికి రైల్వేకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..

భారతీయ రైల్వే ఓ వింత సమస్యను ఎదుర్కొంటుంది. రైల్వేకు ప్రయాణికులను తరలించేందుకు అయ్యే ఖర్చు కన్నా వాళ్లు చేసే పనులతో ఎక్కువ ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు...

Indian Railway: అది శుభ్రం చేయడానికి రైల్వేకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..
Trains
Srinivas Chekkilla
|

Updated on: Oct 13, 2021 | 2:55 PM

Share

భారతీయ రైల్వే ఓ వింత సమస్యను ఎదుర్కొంటుంది. రైల్వేకు ప్రయాణికులను తరలించేందుకు అయ్యే ఖర్చు కన్నా వాళ్లు చేసే పనులతో ఎక్కువ ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ప్రయాణికులు ఏం పనులు చేస్తున్నారంటే.. ప్రయాణికులు గుట్కా, పాన్, పొగాకు తిని రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో ఉమ్మి వేస్తున్నారు. దీనిని శుభ్రం చేయడానికి భారతీయ రైల్వే సంవత్సరానికి అక్షరాల రూ. 1200 కోట్లు ఖర్చు పెడుతోంది.

కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రయాణికుల తీరు మారడం లేదు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో బహిరంగ ఉమ్మివేయడం ఒక పెద్ద సమస్యగా మారింది. బయోడిగ్రేడబుల్ స్పిట్టన్ విత్తనాలను పారవేసినప్పుడు అవి మొక్కలుగా పెరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైల్వే తాజాగా హరిత ఆవిష్కరణ చేసింది. 42 స్టేషన్లలో స్పిట్టన్ పర్సును రూ. 5 నుండి రూ .10 వరకు అందించడానికి ఏర్పాటు చేస్తోంది. దీని కోసం పశ్చిమ, ఉత్తర, సెంట్రల్ రైల్వే జోన్లు ఒక స్టార్టప్ కంపెనీ EzySpitకి కాంట్రాక్టులు ఇచ్చాయి.

ప్రధానమంత్రి తనకు చాలా ప్రత్యేకమైన సూచన చేశారని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఒక వ్యాసంలో రాశారు. తేనెటీగలకు ఏనుగులు భయపడుతున్నాయని.. తేనెటీగల శబ్దానికి పారిపోతాయని చెప్పారన్నారు. రైలు పట్టాలపై ఏనుగుల ప్రమాదాలను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందో లేదో చూడమని అన్నట్లు తెలిపారు. ఏనుగులను ట్రాక్‌ల నుండి మళ్లించడానికి తేనెటీగ సౌండ్‌ని ఉపయోగించామని.. దీంతో ఏనుగు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. 2017 నుంచి 2021 మే వరకు 950 కి పైగా ఏనుగులు రక్షించబడినట్లు పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో ట్రాక్‌లు దాటేందుకు ఏనుగులు ప్రయత్నించకుండా ఉండేందుకు భారతీయ రైల్వే ఈ ప్రణాళికను నవంబర్, 2017 ప్రారంభించింది.

రైల్వే ట్రాక్‌లపై మాన్యువల్ స్కావెంజింగ్ స్థానంలో త్వరలో స్వీయ చోదక రైల్వే ట్రాక్ స్కావెంజింగ్ వాహనం ఏర్పాటు చేయనున్నట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 5, 2021 న తెలిపింది. డాక్టర్ శరద్ కె. ప్రధాన్, మెకానికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఇంజినీరింగ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR), భోపాల్, మల్టీఫంక్షనల్ రైల్వే ట్రాక్ స్కావెంజింగ్ వాహనాన్ని అభివృద్ధి చేసింది. ఈ వాహనం పొడి, తడి చూషణ వ్యవస్థలు, గాలి మరియు నీటి స్ప్రేయింగ్ నాజిల్‌లు, కంట్రోల్ సిస్టమ్, రోడ్ కమ్ రైల్ అటాచ్‌మెంట్‌తో అమర్చబడి ఉంటుంది, దీనికి రైల్వే ట్రాక్‌లను ఆటోమేటిక్ క్లీనింగ్ చేయడానికి డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి మాత్రమే అవసరం.

Read Also..Rahul Gandhi: ఆ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాల్సిందే.. రాష్ట్రపతిని కోరిన కాంగ్రెస్ బృందం..

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే