వామ్మో.. ఇదేం మాయ! 34 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి మళ్లీ ఇంటికి! ఎవ్వరినీ గుర్తుపట్టలేక అవస్తలు

42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎన్నాళ్లు ఎదురు చూసినా అతను తిరిగిరాలేదు. దీంతో అతను చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. కోర్టులో డెత్‌ సర్టిఫికేట్‌ కూడా పొందారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత నేను బతికే ఉన్నానంటూ వచ్చాడా..

వామ్మో.. ఇదేం మాయ! 34 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి మళ్లీ ఇంటికి! ఎవ్వరినీ గుర్తుపట్టలేక అవస్తలు
Dead Man Returns Home Alive
Follow us

|

Updated on: Jun 02, 2023 | 7:03 AM

జైపూర్: 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎన్నాళ్లు ఎదురు చూసినా అతను తిరిగిరాలేదు. దీంతో అతను చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. కోర్టులో డెత్‌ సర్టిఫికేట్‌ కూడా పొందారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత నేను బతికే ఉన్నానంటూ వచ్చాడా వ్యక్తి. ఈ విచిత్ర సంఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో మంగళవారం (మే 30) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా బన్సూర్‌ గ్రామానికి చెందిన హనుమాన్‌ సైనీ (75)కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1989లో ఢిల్లీలోని ఓ షాప్‌లో పనికి వెళ్లిన అతను కనిపించకుండా పోయాడు. ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాకు వెళ్లిపోయారు. అక్కడ హిమాలయాల్లోని మాతా మందిరంలో పూజలు చేస్తూ సాదు జీవితాన్ని గడిపాడు. దాదాపు 34 ఏళ్ల తర్వాత 75 ఏళ్ల వయసులో ఢిల్లీకి తిరిగి వచ్చాడు. ఐతే ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా మారిపోయి ఉండటంతో తన ఇల్లు, అయిన వాళ్లను గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఓ స్నేహితుడి సహాయంతో అక్కడి నుంచి స్వగ్రామం బన్సూర్‌ చేరుకున్నారు. చాలాకాలం తర్వాత హనుమాన్‌ సైనీ ఇంటికి రావడంతో అతని కుటుంబ సభ్యులతో ఊరంతా అవాక్కయ్యారు. ఐతే హనుమాన్‌ సైనీ మాత్రం ఎవ్వరినీ గుర్తుపట్టలేక పోయాడు. చివరికి ఆయన తన భార్య దుర్గాదేవిని గుర్తుపట్టడంతో కథ సుఖాంతమైంది.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆశ్చర్యంతో ఆయన ఇంటి చుట్టూ గుమికూడారు. నిజానికి.. అతను మృతి చెంది ఉంటాడని, ఇక ఎప్పటికీ తిరిగిరాడేమోనని హనుమాన్‌ సైనీ కుమారుడు రామ్‌చంద్ర గతేడాది డెత్‌ సర్టిఫికెట్‌ కూడా తీసుకున్నాడు. తండ్రి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్నో రోజులు వెతికామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతని ఆచూకీ లభించకపోవడంతో మరణించి ఉండాటని భావించినట్లు అతను చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?