AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న బస్సు.. 11మంది మృతి, 20మందికి సీరియస్

ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు సికార్ ఎస్పీ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. అలాగే 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న బస్సు.. 11మంది మృతి, 20మందికి సీరియస్
Sikar Bus Accident
Balaraju Goud
|

Updated on: Oct 29, 2024 | 6:30 PM

Share

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. సికార్‌లో మంగళవారం(అక్టోబర్ 29) మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. సికార్‌ జిల్లాలోని లక్ష్మణ్ గఢ్ ప్రాంతంలోని కల్వర్టుపై ప్రయాణికులతో నిండిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి పడిపోయింది. బస్సు వేగంతో కల్వర్టు గోడను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌ వైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ బస్సులో దాదాపు 40 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనకుస సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని క్షతగాత్రులందరినీ బస్సులో నుంచి దించి చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌, సికార్‌ ఆసుపత్రులకు తరలించారు. మృతుల మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏదీ ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే అందుకు గల కారణాలను పోలీసులు వారి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సికార్‌ పోలీసులు తెలిపారు. బస్సు అకస్మాత్తుగా ఊగడం ప్రారంభించిందని, కొద్దిసేపటికే బస్సు పూర్తి వేగంతో కల్వర్టు గోడను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.

బస్సులోని డ్రైవర్‌ వైపు పూర్తిగా దెబ్బతినడంతో బస్సులో కూర్చున్న ప్రయాణికులకు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న సికార్ సిటీ డీఎస్పీ (ఐపీఎస్) షాహీన్ సీ, ఏడీఎం రతన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు సికార్ ఎస్పీ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. అలాగే 20 మందికి పైగా గాయపడ్డారు. బస్సులో 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారని తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!