AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట లభించేనా..? తీర్పుపై సూరత్ సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌..

2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట లభించేనా..? తీర్పుపై సూరత్ సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2023 | 9:56 AM

Share

2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. పరువునష్టం కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై.. రాహుల్ గాంధీ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించనున్నారు. సూరత్ పర్యటనలో రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉండనున్నారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై దాదాపు 10 రోజుల తర్వాత.. సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ వేసేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేసింది.

ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటూ గడువు ఇచ్చింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనీ లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్ సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ, ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది.

అప్పుడు రాహుల్ 8 ఏళ్లపాటూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు..మరీ, సెషన్స్‌ కోర్టులో రాహుల్‌కు ఊరట లభిస్తుందా ? లేదా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..