AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: గవర్నర్ రాజ్ భవన్ మెను నుంచి టమాటా మాయం.. కారణం ఇదే అంటూ కీలక ప్రకటన చేసిన..

Tomato Prices Soar: ప్రథమ పౌరుడి వరకు చుక్కలు చూపిస్తోంది. మన ఇంట్లోని వంటగది నుంచే కాదు.. గవర్నర్ కిచెన్ మెనూ నుంచి కూడా మాయం అయ్యింది. అవును..! ఇది నిజం... రోజు రోజుకు పెరుగుతున్న టమాట ధరతో విసిగిపోయన ఆ రాష్ట్ర గవర్నర్ తమ ఫుడ్ మెనును మార్చుకున్నారు. అంత పెట్టి కొనేది లేదని తేల్చేశారు. టమోటాలు నుండి తొలగించబడ్డాయి. పంజాబ్‌లో టమాటా కిలో ధర రూ.200కి చేరింది. ఇది మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టమాటల స్థానంలో మరో వంటకం బెస్ట్ అని నిర్ణయించకున్నారు. ఇందులో భాగంగా మొదట మన ఇంటి వంటగది నుంచే మొదలు కావాలని..

Tomato Price: గవర్నర్ రాజ్ భవన్ మెను నుంచి టమాటా మాయం.. కారణం ఇదే అంటూ కీలక ప్రకటన చేసిన..
Tomato
Sanjay Kasula
|

Updated on: Aug 04, 2023 | 10:30 AM

Share

టమాటా మోత మోగిస్తూనే ఉంది. సామన్యుడి నుంచి ప్రథమ పౌరుడి వరకు చుక్కలు చూపిస్తోంది. మన ఇంట్లోని వంటగది నుంచే కాదు.. గవర్నర్ కిచెన్ మెనూ నుంచి కూడా మాయం అయ్యింది. అవును..! ఇది నిజం… రోజు రోజుకు పెరుగుతున్న టమాట ధరతో విసిగిపోయన ఆ రాష్ట్ర గవర్నర్ తమ ఫుడ్ మెనును మార్చుకున్నారు. అంత పెట్టి కొనేది లేదని తేల్చేశారు. టమోటాలు నుండి తొలగించబడ్డాయి. పంజాబ్‌లో టమాటా కిలో ధర రూ.200కి చేరింది. ఇది మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టమాటల స్థానంలో ఇతర ఆహారపదార్థాలను తాత్కాలికంగా భర్తీ చేయాలని అక్కడి గవర్నర్ ప్రజలను కోరారు. అలా చేయడం వల్ల వాటి పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

రాజ్‌భవన్‌ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం.. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అధిపతిగా కూడా పనిచేస్తున్నారు. పెరుగుతున్న ఆహార ధరల ప్రభావాలను అనుభవిస్తున్న పంజాబ్ నివాసితులకు మద్దతుగా టమాట వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించాలని నిర్ణయించుకున్నారు.

ఒక వస్తువు వినియోగాన్ని నిలిపివేస్తే లేదా తగ్గించడం ద్వారా దాని ధరపై ప్రభావం చూపుతుంది. డిమాండ్ తగ్గడం వలన ధర స్వయంచాలకంగా తగ్గుతుంది. ప్రజలు ప్రస్తుతానికి వారి ఇంట్లో ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తారని.. టమాటా ధరల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతారని నేను ఆశిస్తున్నాను.. అంటూ గవర్నర్ పురోహిత్ పేర్కొన్నారు. సరఫరా గొలుసులో అంతరాయాలు, వాతావరణ పరిస్థితులు, ఇతర మార్కెట్ డైనమిక్స్.. వంటి వివిధ కారణాల వల్ల టమాట ధరలు పెరగడానికి కారణమని రాజ్ భవన్ ప్రకటన పేర్కొంది.

ఇది తమ నుంచి మొదలు పెడుతున్నట్లుగా గవర్నర్ భవన్ తెలిపింది. టమాటా వినియోగాన్ని వదులుకోవడం ద్వారా.. పొదుపు, వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం.. ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం గవర్నర్ లక్ష్యం అని తాజా ప్రకటనలో పేర్కొంది గవర్నర్ భవన్.

మరోవైపు ఉత్తరప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు పోషకాహార శాఖ సహాయ మంత్రి ప్రతిభా శుక్లా గత నెలలో టమాటాలను ఇంట్లోనే పండించండి లేదా వాటి ధరలను నియంత్రించడంలో సహాయపడటానికి వాటిని తినడం మానేయండని ప్రజలకు సలహా ఇవ్వడంతో దుమారం రేపింది.

టమాటా ఖరీదు అయితే ఇంట్లోనే పండించుకోవాలి.. టమాట తినడం మానేస్తే ధరలు తగ్గక తప్పదు.. టమాటా బదులు నిమ్మకాయ కూడా తినొచ్చు.. ఎవరూ తినకపోతే ధరలు తగ్గుతాయి… మీరు టమోటాలు తినకండి, ఆపై నిమ్మకాయను వాడండి, ఏది ఖరీదు ఎక్కువైతే అది విస్మరించండి. అది స్వయంచాలకంగా చౌకగా మారుతుందని  మంత్రి వెల్లడించారు.

మరిన్ని జాతీయ న్యూస్ కోసం