AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుమానంతో ప్రయాణికుడి బ్యాగ్ తనిఖీ చేసిన రైల్వే పోలీసులు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు..

దేశంలో అక్రమంగా బంగారం రవాణా చేసే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే త్రిపురలో వెలుగుచూసింది.

అనుమానంతో ప్రయాణికుడి బ్యాగ్ తనిఖీ చేసిన రైల్వే పోలీసులు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు..
Bag
Aravind B
|

Updated on: Mar 22, 2023 | 12:57 PM

Share

దేశంలో అక్రమంగా బంగారం రవాణా చేసే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే త్రిపురలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే అగర్తల రైల్వే స్టేషన్ నుంచి తెజాస్-రాజధాని ఎక్సప్రెస్ బయలుదేరనుంది. పక్కా సమాచారంతో పోలీసులు ఆ రైలులో తనిఖీలు చేయడం ప్రారంభించారు. చివరికి ఓ వ్యక్తి వద్ద 1.5 కేజీల బంగారం ఉండటాన్ని గుర్తించారు.వెంటనే ఆ బంగారాన్ని అతని వద్ద ఉన్న రూ.6710 నగదను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి త్రిపురాలోని సెపాహిజాలా జిల్లాకి చెందిన అబుల్ బాసర్ గా గుర్తించారు. అగర్తల రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలు బయలుదేరే కొన్ని నిమిషాల ముందు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ బంగారం విలువ మార్కెట్ లో దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. నిందితుడ్ని కస్టమ్స్ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..