AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JP Nadda: కరోనా కాలంలో ప్రధాని మోడీ చప్పట్లు కొట్టించి, కొవ్వొత్తులు ఎందుకు వెలిగించమన్నారో తెలుసాః జేపీ నడ్డా

జనం చేత చప్పట్లు కొట్టిస్తేనో.. లేక ఆకాశంలోకి లైట్లేస్తేనో వైరస్ పోదని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ఆదివారం ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని ఘాటుగా స్పందించారు.

JP Nadda: కరోనా కాలంలో ప్రధాని మోడీ చప్పట్లు కొట్టించి, కొవ్వొత్తులు ఎందుకు వెలిగించమన్నారో తెలుసాః జేపీ నడ్డా
Jp Nadda
Balaraju Goud
|

Updated on: Nov 28, 2021 | 7:49 PM

Share

JP Nadda on Modi clapping lighting candles: కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆపేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనాపై యుద్ధం చేస్తోన్న వీరులకు మద్దతు పలకాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. జనం చేత చప్పట్లు కొట్టిస్తేనో.. లేక ఆకాశంలోకి లైట్లేస్తేనో వైరస్ పోదని ప్రధాని మోడీని ఎద్దేవా చేశారు. అయితే, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ఆదివారం ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని ఘాటుగా స్పందించారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రజలు చప్పట్లు కొట్టి కొవ్వొత్తులను వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారని, ఈ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనోధైర్యంగా ఉండేందుకు ఇలా చేయించారని వివరణ ఇచ్చారు.

రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 130 కోట్ల జనాభా కరోనాపై భీకర యుద్ధం చేశామని, ప్రతిపక్షాలు చప్పట్లు కొట్టగా.. కొవ్వొత్తి వెలిగించడంపై చమత్కరించారు. ప్రధాని నరేంద్ర మోడీ చప్పట్లు కొట్టడం మరియు కొవ్వొత్తులు వెలిగించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రజల్లో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంతో పాటు దేశప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని మోడీ భావించారన్నారు. ప్రజలు కరోనా మహమ్మారిపై పోరాడాలని చెప్పాలనుకుంటున్నారు, ఆ సమయంలో ప్రజల మనోధైర్యాన్ని పెంచడానికి ఇది జరిగిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.

‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ వివిధ వేదికల ద్వారా రాజకీయ అంశాలను ముందుకు తెచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎప్పుడు రాజకీయాలు మాట్లాడలేదన్నారు. ప్రజలను అన్ని రంగాల్లో అవగాహన కల్పించాలని, ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు దేశ ప్రజలకు చేరాలన్న సంకల్పంతోనే రేడియో కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈరోజు ఆదివారం నాడు ‘మన్ కీ బాత్’ 83వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారని జేపీ నడ్డా తెలిపారు. అతను తన నెలవారీ రేడియో ప్రోగ్రామ్ ద్వారా రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు లేదా దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించలేదు. ఈ కార్యక్రమం ద్వారా దేశ సంస్కృతి గురించి మాట్లాడారని నడ్డా గుర్తు చేశారు.

Read Also…  AP CS Sameer Sharma: మరో ఆరు నెలలపాటు ఏపీ సీఎస్‌గా సమీర్ శర్మ.. పదవీ కాలం పొడిగించిన కేంద్రం