WITT PM Modi Speech: ‘మరోసారి మా ప్రభుత్వం’.. టీవీ9 సమ్మిట్‎లో దేశానికి మోదీ ఏం సందేశం ఇచ్చారంటే..

దేశంలోనే అతి పెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ9 నిర్వహించిన వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే శిఖరాగ్ర సదస్సు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగిన ఈ సమావేశంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఢిల్లీ అశోకా హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు, మైహోమ్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్ రాము రావు, టీవీ9 గ్రూప్‌ ఎండీ, సీఈఓ బరుణ్‌దాస్‌ మర్యాదకపూర్వకంగా వేదికపైకి తీసుకొచ్చారు. ప్రధానికి మైహోమ్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ రాము రావు స్వాగతం పలికారు.

WITT PM Modi Speech: 'మరోసారి మా ప్రభుత్వం'.. టీవీ9 సమ్మిట్‎లో దేశానికి మోదీ ఏం సందేశం ఇచ్చారంటే..
Witt Pm Modi
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 29, 2024 | 8:52 PM

దేశంలోనే అతి పెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ9 నిర్వహించిన వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే శిఖరాగ్ర సదస్సు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగిన ఈ సమావేశంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఢిల్లీ అశోకా హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు, మైహోమ్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్ రాము రావు, టీవీ9 గ్రూప్‌ ఎండీ, సీఈఓ బరుణ్‌దాస్‌ మర్యాదకపూర్వకంగా వేదికపైకి తీసుకొచ్చారు. ప్రధానికి మైహోమ్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ రాము రావు స్వాగతం పలికారు. ప్రధాని ఆకాంక్షిస్తున్న వికసిత భారత్‌కు టీవీ9 సంపూర్ణ సహకారం అందిస్తుందని రాము రావు ప్రతిజ్ఞ చేశారు. ఈ గ్లోబల్ ఈవెంట్ కు వివిధ దేశాల ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. దేశం ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు.

‘దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనస్సులు గెలుచుకున్న వ్యక్తి ప్రధాని మోదీ. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక స్ఫూర్తి, ఆయన ఒక దార్శనికుడు, ఆయన ఒక ప్రపంచ నాయకుడు. నాలాంటి నవభారత తరానికి ఆయన ఒక స్ఫూర్తి. యువతతో ఆయన అనుసంధానమయ్యే తీరు అసమానం. మాలాంటి యువత ఆకాంక్షలు, ఎదుర్కొనే సవాళ్లు, కనేకలలను ఆయన లోతుగా అర్థం చేసుకుంటారు. అంకితభావంతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని యువత అర్థం చేసుకునేందుకు ఆయన ఒక నిలువెత్తు ఉదాహరణ’ అని కీర్తించారు. ఆ తరువాత టీవీ9 సీఈఓ బరుణ్‌దాస్ వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సు ఉద్దేశాలు వివరించారు. ‘మోదీజీ, మీరు నవభారత రూపశిల్పి మాత్రమే కాదు, రానున్న వెయ్యేళ్లకు పునాదులు వేయాలని కోరుకునే వ్యక్తి మీరు. ప్రస్తుతం మనం ఉన్న ప్రజాస్వామ్యంలో నాయకులు చాలా సందర్భాల్లో పూర్తి కాలం పదవిలో ఉండలేకపోతున్నారు. కాని మీ దార్శనికత కేవలం దశాబ్దకాలానికే కాదు ఒక సహస్రాబ్ది వరకు నిలిచిపోతుంది.’

ఆ తరువాత టీవీ9 చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అభినందించారు. భారతదేశ వైవిధ్యానికి టీవీ నైన్‌ న్యూస్‌ రూమ్‌ ప్రతిబింబంగా నిలుస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘టీవీ9కు అనేక భారతీయ భాషల్లో వేదికలున్నాయి. భారతదేశ వికసిత ప్రజాస్వామ్యానికి టీవీ9 ప్రతిబింబం కూడా. వివిధ భాషల్లో పనిచేస్తున్న టీవీ9 సిబ్బంది, టెక్నికల్‌ టీమ్‌కు నా అభినందనలు. ఇవాళ్టి చర్చ కోసం టీవీ9 చాలా ఆసక్తికరమైన అంశం India poised for the Next Big Leap ఎంచుకుంది. ఆ పెద్ద అడుగు అన్నది మనం ఉత్సాహంగా ఉన్నప్పుడే సాధ్యం. వ్యక్తి కాని దేశం కాని నిరాశా నిస్పృహల్లో ఉన్నప్పుడు ఆ పెద్ద అడుగు గురించి ఆలోచనే చేయలేరు’ అన్నారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీ గతంలో భారతదేశాన్ని ప్రస్తుత భారత్‌ను పోల్చి చూపారు. అనేక గణాంకాలను ఆయన అలవోకగా ప్రస్తావించారు. దేశ ఆకాంక్షలేంటి, ముందుకు సాగేందుకు కనిపిస్తున్న ఉత్సాహంలో ఏముందో వివరించారు. భారత్‌ నేడు ముందడుగు వేసేందుకు గడిచిన పదేళ్ల పాలన ఒక లాంచ్‌ప్యాడ్‌గా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. పదేళ్ల తమ పాలనలో దేశం ఎలాంటి మార్పులు చూసిందో వివరించారు.

ఇవి కూడా చదవండి

‘మనం మొదటి, రెండు, మూడో పారిశ్రామిక విప్లవంలో వెనుకబడిపోయాం. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహించాలి. ఆ దిశగా ప్రతీ నిత్యం జరుగుతున్న అభివృద్ధి పనులతో భారత్‌కు నూతనశక్తి లభిస్తోంది. దేశంలో ప్రతీ రోజు రెండు కాలేజీలు ప్రారంభమయ్యాయి. ప్రతీ వారం ఒక యూనివర్సిటీ ప్రారంభమైంది, ప్రతీ రోజు 55 పేటెంట్లు, 600 ట్రేడ్‌మార్కులు రిజిస్టర్‌ అయ్యాయి. ప్రతీ రోజు 1.50 లక్షల రూపాయల ముద్ర రుణాల పంపిణీ జరిగింది. దేశంలో ప్రతీ రోజు 37 కొత్త స్టార్టప్స్‌ వచ్చాయి. దేశంలో నిత్యం 16వేల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. దేశంలో ప్రతీ రోజు మూడు కొత్త జనౌషధి కేంద్రాలు తెరుచుకున్నాయి. ప్రతీ రోజు 14 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ నిర్మాణం జరిగింది. ప్రతీ రోజు 50 వేల కంటే ఎక్కువ ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి. ప్రతీ సెకనకు ఒక హర్‌ ఘర్‌కో జల్‌ కనక్షన్‌ ఇచ్చాం. భారతదేశంలో ప్రతీ రోజు 75 వేల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించాం’ అని ఈ వేదిక మీద నుంచి వివరించారు.గతంలో ప్రభుత్వాలు దేశ డీఎన్‌ఎను చంపేశాయని ప్రధాని మోదీ అన్నారు. కుంభకోణాలు, అవినీతితో నాటి పాలన స్తంభించిపోయిందని విమర్శించారు. ఈ పదేళ్లలో ఆ వ్యవస్థను సమూలంగా మార్చేశామని ప్రధాని మోదీ ప్రకటించారు.

‘దేశం ఇలాగే నడిచిపోతుందని వాళ్లు అనుకున్నారు. దానికి తోడు అవినీతి, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, విధాన పక్షవాతం, వారసత్వ రాజకీయాలు దేశ డీఎన్‌ఎను నాశనం చేశాయి. గడిచిన పదేళ్లలో ఆ భయానక స్థితి నుంచి దేశాన్ని ముందుకు తీసుకొచ్చాం. గడిచిన పదేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ టాప్‌ ఫైవ్‌లోకి వచ్చింది. దేశంలో నేడు అవసరమైన విధానాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. నిర్ణయాలు కూడా అంతే వేగంగా తీసుకోవడం జరుగుతోంది. మైండ్‌సెట్‌లో వచ్చిన మార్పులు అద్భుతాలు తీసుకొచ్చాయి’ అని గతానికి వాస్తవానికి మధ్య తేడాలను చెప్పారు. గత పాలకులకు భారతీయుల శక్తి సామర్ధ్యాలపై నమ్మకం లేదని ప్రధాని మోదీ అన్నారు. వాటిని తక్కువ అంచనా వేశారని విమర్శించారు. భారతీయులు నిరాశావాదులని ఎర్రకోట సాక్షిగా అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు. ఓటమి భావనను అందిపుచ్చుకున్నారని అన్నారు. భారతీయులు సోమరులను ఎర్రకోట నుంచి గత పాలకులు చెప్పిన విషయాన్ని ప్రధాని ఎంతో ఆవేదనతో చెప్పారు.

‘మా ప్రభుత్వం దేశం ముందు అనే భావనకు ప్రాధాన్యమిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఏం పని చేయకపోవడమే గత ప్రభుత్వాలకు చాలా తేలికైన పనిగా ఉండేది. ఆ వర్క్ కల్చర్‌తో దేశనిర్మాణం జరగదు, దేశమూ ముందుకెళ్లదు’. వచ్చే ఐదేళ్ల కాలం భారతదేశానికి ఎంతో కీలకమని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆకాంక్షలను తాము తమ మూడో పరిపాలన కాలంలో కచ్చితంగా నెరవేర్చుతామని టీవీ9 వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఇవాళ అందరూ అంటున్నారు ఇండియా ఈజ్‌ ది ఫ్యూచర్‌ అని. రానున్న సమయం చాలా కీలకమైనది. వచ్చే ఐదేళ్లు అత్యంత కీలకమైనవి. ఇక్కడ కూర్చున్న అందరి ముందు నేను చెప్తున్నాను, వచ్చే మా మూడో పాలనలో భారతదేశ శక్తిసామర్ధ్యాలను కొత్త ఎత్తుకు తీసుకెళ్లాలి. వికసిత భారత లక్ష్యంలో రానున్న ఐదేళ్ల కాలం మన దేశ ప్రగతి, ప్రశస్తికి కీలక సమయం. ఈ సెమినార్‌, జరిగినా జరగకపోయినా నేను ఎంతో విశ్వాసంతో చెప్తున్నాను కచ్చితంగా పెద్ద అడుగు మాత్రం పడుతుంది’ అన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు నుంచి మొదలుపెట్టి రామాలయ నిర్మాణం వరకు, ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు నుంచి మహిళా రిజర్వేషన్‌ వరకు, వన్‌ ర్యాంక్‌ వన్ పెన్షన్‌ నుంచి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ వరకు అన్ని నిర్ణయాలు దేశం ముందు అనే భావనతో తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు అసంపూర్ణంగా వదిలేసిన ఎన్నో పనులను తాము పూర్తి చేశామని వెల్లడించారు. 21వ శతాబ్దపు రాబోయే రోజుల కోసం కూడా భారత్‌ను మనమే సిద్ధం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్పేస్‌ నుంచి సెమీ కండక్టర్‌ వరకు, డిజిటల్‌ నుంచి డ్రోన్ వరకు, AI నుంచి క్లీన్ ఎనర్జీ వరకు, 5G నుంచి ఫిన్‌టెక్‌ వరకు అన్ని రంగాల్లో భారతదేశం నేడు ముందు వరుసలో నిలుస్తోందని ప్రధాని మోదీ టీవీ నైన్‌ వేదికగా ప్రకటించారు.

పూర్తి వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..