AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. పలు కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ..

వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను గుజరాత్‌ ప్రభుత్వం నిర్వహించడం ఇది 10వ సారి. మోదీ సీఎంగా ఉన్న సమయంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

PM Modi: వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. పలు కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 10, 2024 | 4:10 PM

వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను గుజరాత్‌ ప్రభుత్వం నిర్వహించడం ఇది 10వ సారి. మోదీ సీఎంగా ఉన్న సమయంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వస్తువులను ప్రదర్శించారు.

34 దేశాలకు చెందిన ప్రతినిధులు, 16 సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ట్రేడ్‌షోను ప్రతినిధులతో కలిసి ఆసక్తిగా తిలకించారు మోదీ. స్టాళ్లను పరిశీలిస్తూ.. ప్రధాని మోదీ వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. వివిధ సంస్థల సీఈవోలతో పాటు ప్రతినిధులతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులు తదితర అంశాలపై మాట్లాడారు. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు.

ఈనెల 12వ తేదీ వరకు వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమిట్‌ కొనసాగుతుంది. భవిష్యత్‌ తరాల కోసం ఎన్నో ఉత్పత్తులను వివిధ సంస్థలు తయారు చేస్తున్నాయని అన్నారు మోదీ. 2003లో గుజరాత్‌ గ్లోబల్‌ సమిట్‌ ప్రారంభమయ్యింది. అంతర్జాతీయ సంస్థలతో ఈ సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం పలు ఒప్పందాలను చేసుకుంది.

ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ కూడా ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో తన ఉత్పత్తులను ప్రదర్శించింది.

కాగా.. గాంధీనగర్‌లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ స్మారక నాణెం, స్టాంపును విడుదల చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..