AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi MP Tour: నేడు భోపాల్‌లో ప్రధాని మోడీ పర్యటన, మహాకుంభ్‌లో ప్రసంగం, మినిట్ టు మినిట్ షెడ్యూల్

బీజేపీకి చెందిన ఈ జన ఆశీర్వాద యాత్రలు 10,600 కిలోమీటర్ల దూరం జరగాల్సి ఉంది. అయితే ప్రజల మద్దతు, ఉత్సాహం కారణంగా ఈ యాత్రలు 10,880 కిలోమీటర్ల దూరం సాగాయి. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌తో సహా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు ఇప్పటికే పూర్తి స్థాయిలో  రంగంలోకి దిగారు. 

PM Modi MP Tour: నేడు భోపాల్‌లో ప్రధాని మోడీ పర్యటన, మహాకుంభ్‌లో ప్రసంగం, మినిట్ టు మినిట్ షెడ్యూల్
Pm Modi
Surya Kala
|

Updated on: Sep 25, 2023 | 7:16 AM

Share

ప్రధాని నరేంద్ర మోడీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించనున్నారు. గత 45 రోజుల్లో ప్రధాని మోడీ మూడోసారి రాష్ట్రానికి వస్తున్నారు. తన పర్యటనలో ప్రధాని మోడీ భోపాల్‌లో జన ఆశీర్వాద యాత్రల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. కార్మికుల మహాకుంభ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ  ఉదయం 11 గంటలకు భోపాల్‌లోని జంబోరీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. జంబోరీలో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన జైపూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

వాస్తవానికి మధ్యప్రదేశ్‌లో ఎన్నికల త్వరలో జరగనున్న నేపథ్యంలో నేతలు ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఐదు జన ఆశీర్వాద యాత్రలు నిర్వహించబడ్డాయి. మొదటి యాత్ర సెప్టెంబరు 3న చిత్రకూట్ నుండి బయలుదేరగా, మిగిలిన యాత్రలు షియోపూర్, నీముచ్, మాండ్లా, ఖాండ్వా నుండి ప్రారంభమయ్యాయి. బీజేపీ ఐదు జన ఆశీర్వాద యాత్రలు చేపట్టడం వెనుక కారణం అన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేయడమే..

బీజేపీ నాయకులు చెప్పిన ప్రకారం బీజేపీకి చెందిన ఈ జన ఆశీర్వాద యాత్రలు 10,600 కిలోమీటర్ల దూరం జరగాల్సి ఉంది. అయితే ప్రజల మద్దతు, ఉత్సాహం కారణంగా ఈ యాత్రలు 10,880 కిలోమీటర్ల దూరం సాగాయి. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌తో సహా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు ఇప్పటికే పూర్తి స్థాయిలో  రంగంలోకి దిగారు.

ప్రధాని మోడీ మినిట్ టు మినిట్ కార్యక్రమం

  1. ప్రధాని మోడీ ఉదయం 9.35 గంటలకు ఢిల్లీ నుంచి భోపాల్‌కు బయలుదేరుతారు.
  2. ఉదయం 10.55 గంటలకు భోపాల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు జంబోరీ మైదానానికి బయలుదేరుతారు.
  3. ప్రధాని మోడీ 11.30 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ సుమారు గంటసేపు ఉండి సభలో ప్రసంగించనున్నారు.
  4. అనంతరం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రధాని మోడీ భోపాల్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  5. మధ్యాహ్నం 1:10 గంటలకు విమానాశ్రయం నుంచి జైపూర్‌కు బయలుదేరి వెళతారు.
  6. జంబోరీలో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ప్రధాని మోడీ జైపూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
  7. అక్కడ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారు బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. బీజేపీ జన ఆక్రోశ్ యాత్రలు కూడా ఇక్కడే ముగుస్తాయి.

జైపూర్‌లో 2.5 లక్షల మందిని సమీకరించడం లక్ష్యం

ప్రధాని మోడీ జైపూర్‌ ర్యాలీని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని 50 వేల మంది బూత్‌ ఇన్‌ఛార్జ్‌లకు 2.5 లక్షల మందిని సమీకరించే బాధ్యతను అప్పగించారు. ఇందుకోసం ఒక్కో బూత్ నుంచి కనీసం ఐదుగురిని ర్యాలీకి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది కాకుండా  బీజేపీ రాష్ట్ర అధికారులు వారి వారి స్థాయిలలో జనాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని జైపూర్ ర్యాలీకి 3 లక్షల మందికి పైగా హాజరయ్యేలా రాష్ట్ర బీజేపీ ప్రయత్నిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..