AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అందుబాటులోకి మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..

దేశంలోని పలు ప్రాంతాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇవ్వాల్టి నుంచి మరో వందేభారత్ ట్రైన్ సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీ-భోపాల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు.

PM Modi: అందుబాటులోకి మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 01, 2023 | 8:51 AM

Share

దేశంలోని పలు ప్రాంతాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇవ్వాల్టి నుంచి మరో వందేభారత్ ట్రైన్ సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీ-భోపాల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో పర్యటించనున్నట్లు పీఎంఓ కార్యాలయం పేర్కొంది. భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును రాణి కమలాపతి స్టేషన్‌లో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో కూడా మోడీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. శనివారం ఉదయం ప్రధాని మోడీ భోపాల్ చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైలు 708 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 7.45 గంటల్లో పూర్తి చేయనుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు భోపాల్‌లో ఉదయం 5.55 గంటలకు బయలుదేరి 11.40 గంటలకు ఆగ్రా చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ వందేభారత్‌ రైలు శనివారం మినహా ప్రతిరోజు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ-భోపాల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈరోజు ఏప్రిల్ 3 నుంచి రాకపోకలు సాగిస్తుందని అధికారులు తెలిపారు. సీట్ల రిజర్వేషన్ ఈరోజు నుంచి ప్రారంభంకానుంది.

కాగా.. వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా వందేభారత్‌ సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ వందేభారత్ రైలుతో పదకొండు సర్వీసులు దేశంలో రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటివరకు కేంద్రం 10 రైళ్లను ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అత్యాధునికమైన‌ సౌకర్యాలు ఉన్నాయి. ఈ సెమీ హైస్పీడ్‌ రైలు గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోనుంది.

చివరి రోజు మోడీ ప్రసంగం..

కాగా.. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. చివరి రోజు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో జాతీయ భద్రతకు సంబంధించిన పలు ప్రధాన అంశాలపై చర్చిస్తున్నారు. సాయుధ దళాల సన్నద్ధత ఆత్మనిర్భరత సాధించే దిశగా రక్షణ వ్యవస్థలో పురోగతే లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి