AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌ ఆలయాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలి.. సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేసిన ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతమ్రైన పితోర్‌గఢ్‌లోని పవిత్ర పార్వతీ కుండ్‌లో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తలపాగాతో పాటు స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి మోడీ ఈ పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఢమరుకం, శంఖానాదాలతో శివుడిని ప్రార్థించారు. అనంత‌రం జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు.

PM Modi: పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌ ఆలయాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలి.. సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేసిన ప్రధాని మోడీ
Pm Narendra Modi In Uttarakhand
Basha Shek
|

Updated on: Oct 14, 2023 | 10:48 AM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతమ్రైన పితోర్‌గఢ్‌లోని పవిత్ర పార్వతీ కుండ్‌లో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తలపాగాతో పాటు స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి మోడీ ఈ పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఢమరుకం, శంఖానాదాలతో శివుడిని ప్రార్థించారు. అనంత‌రం జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కైలాస శిఖరం ముందు కాసేపు కూర్చుని ధ్యానం చేశారు. ఆపై అక్కడి జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామాన్ని కూడా సందర్శించారు. భారత్-చైనా సరిహద్దులోని పితోర్‌గఢ్‌కు వచ్చిన తొలి ప్రధాని నరేంద్ర మోడీయే కావడం విశేషం. ఈ సందర్భంగా గుంజీ గ్రామస్తులతోనూ సమావేశమయ్యారు ప్రధాని. అక్కడి గ్రామస్తులు తయారు చేస్తున్న స్థానిక ఉత్పత్తులను పరిశీలించి ప్రశంసలు కురిపించారు. అనంతరం తన పర్యటన వివరాలను ట్విట్టర్‌ వేదికగా అందరితో పంచుకున్నారు. ‘ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతి కుండ్‌లో దర్శనంతో నేనెంతో సంతోషించాడు. ఇక్కడ పూజ‌లు నిర్వహించి నేనెంతో పొంగిపోయాను. ఇక్కడ జ‌రిగిన ఆది కైలాస దర్శనంతో నా మనసు కూడా ఎంతో సంతోషించింది. ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఆధ్యాత్మికత, సంస్కృతికి సంబంధించిన ఈ ప్రదేశం నుంచి మన దేశంలోని కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

తాజాగా ఉత్తరాఖండ్‌ పర్యటనకు సంబంధించిన మరిన్ని ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు ప్రధాని మోడీ. ‘ఉత్తరాఖండ్‌లో మీరు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఏమిటని ఎవరైనా అడిగితే.. కుమావోన్ ప్రాంతంలోని పార్వతి కుండ్, జగేశ్వర్ ఆలయాల పేర్లను చెబుతాను. వీటిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, దైవత్వం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. నిజం చెప్పాలంటే.. ఉత్తరాఖండ్‌లో సందర్శించదగిన ప్రదేశాలు చాలు ఉన్నాయి. పర్యాటకులు కూడా అధికంగా ఇక్కడికి వస్తుంటారు. నేను కూడా చాలా సార్లు ఈ రాష్ట్రాన్ని సందర్శించాను. కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పవిత్ర స్థలాలకు వెళ్లాను. ఈ ప్రదేశాలు నాకెంతో మధురానుభూతిని మిగిల్చాయి. అయితే పార్వతి కుండ్, జగేశ్వర్ ఆలయాలకు సందర్శించుకోవడం మాత్రం నా జీవితంలో మర్చిపోలేను’ అని రాసుకొచ్చారు మోడీ.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీ షేర్ చేసిన ఫొటోలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..