AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఆ రెండు అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతాయ్.. పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మాస్ వార్నింగ్..

ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మోదీ స్పష్టంచేశారు. లేదంటే శాంతికి వేరే ఏ మార్గం లేదన్నారు. టెర్రర్ - టాక్స్, టెర్రర్ - ట్రేడ్, ఇవి ఒకసారి కలిసి సాగలేవు.. ఉగ్రవాదం - చర్చలు, ఉగ్రవాదం - వాణిజ్యం ఒకేసారి కలిసి నడవలేవు అంటూ మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సి వస్తే.. ఉగ్రవాదంపై, POK పై మాత్రమే జరుగుతాయంటూ మోదీ స్పష్టంచేశారు.

PM Modi: ఆ రెండు అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతాయ్.. పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మాస్ వార్నింగ్..
India Pakistan Tensions
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2025 | 8:44 PM

Share

ఆపరేషన్‌ సింధూర్‌లో ఇండియన్ ఆర్మీ కీలకంగా వ్యవహరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.. ఆపరేషన్ సిందూర్ అనంతరం.. ప్రధాని మోదీ తొలిసారిగా సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆర్మీకి సెల్యూట్ చేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. బైసరన్‌లో కుటుంబసభ్యుల మధ్యే 26మందిని ఉగ్రమూక బలి తీసుకుందని.. మతం పేరుతో క్రూరంగా చంపిందని పేర్కొన్నారు మోదీ. మన తల్లుల బొట్టు చెరిపితే ఏం జరుగుతుందో చూపించామన్నారు. ఉగ్రవాదులను భారత క్షిపణులు, డ్రోన్‌లు హతమార్చాయన్నారు మోదీ. గ్లోబల్ టెర్రరిజానికి బహావల్పూర్‌ ఒక యూనివర్సిటీగా మారిందన్నారు. భారత్ చర్యలతో పాక్ నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిందన్నారు.

ఉగ్రవాద పోరులో భారత డ్రోన్లు, మిస్సైళ్లు టార్గెట్లు ఛేదించాయని.. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై బాంబుల వర్షం కురిపించాయని మోదీ అన్నారు. భారత్‌ దాడులతో ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారని.. కలలో సైతం భారత్‌ అంటే ఉలిక్కిపడేలా చేశామని తెలిపారు. తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించాం.. భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయంటూ ప్రధాని మోదీ స్పష్టంచేశారు. భారత్‌పై మళ్లీ దాడిచేస్తే ముఖంపగిలే సమాధానంచెబుతామని హెచ్చరించారు. అణుబాంబుల పేరుతో మనల్ని ఎవరూ బెదిరించలేరన్నారు. ఉగ్రవాదాన్ని సహించం..కఠిన చర్యలు కొనసాగిస్తాం.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగిస్తామన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ స్పష్టంచేశారు.

పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సి వస్తే.. ఉగ్రవాదం, పీవోకేపై మాత్రమే జరుగుతాయి-మోదీ

ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మోదీ స్పష్టంచేశారు. లేదంటే శాంతికి వేరే ఏ మార్గం లేదన్నారు. టెర్రర్ – టాక్స్, టెర్రర్ – ట్రేడ్, ఇవి ఒకసారి కలిసి సాగలేవు.. ఉగ్రవాదం – చర్చలు, ఉగ్రవాదం – వాణిజ్యం ఒకేసారి కలిసి నడవలేవు అంటూ మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సి వస్తే.. ఉగ్రవాదంపై, POK పై మాత్రమే జరుగుతాయంటూ మోదీ స్పష్టంచేశారు. బుద్ధపూర్ణిమ – బుద్ధ భగవానుడు శాంతి మార్గం ప్రబోధించాడు.. సైనిక బలగాలకు మరోసారి సెల్యూట్ చేస్తున్నానంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే