AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: టర్కీ, సిరియాలో భారత్ సేవలు అజరామరం.. సహాయక బృందాలతో ప్రధాని మోడీ సమావేశం..

టర్కీ, సిరియా దేశాలలో సేవలందించి తిరిగి స్వదేశానికి వచ్చిన భారత సహాయక బృందాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

PM Modi: టర్కీ, సిరియాలో భారత్ సేవలు అజరామరం.. సహాయక బృందాలతో ప్రధాని మోడీ సమావేశం..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Feb 20, 2023 | 9:06 PM

Share

టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపాలు ఆ దేశాలను అతలాకుతలం చేశాయి. భారీగా ప్రాణ, ఆస్థి నష్టం కలిగింది. ఫిబ్రవరి 6 న సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటివరకు 46వేలకు పైగా ప్రజలు మరణించగా.. లక్షలాది కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. కాగా.. భారీ భూకంపాలతో అల్లాడుతున్న టర్కీ, సిరియా దేశాలకు భారత్ ఆపన్నహస్తం అందించింది. టర్కీ ప్రజలకు సహాయం అందించడానికి భారత్ ఆపరేషన్ దోస్త్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆహారం, అత్యవసర వైద్య పరికరాలు, పలు వస్తువులను అందించింది. అంతేకాకుండా.. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, వైద్య సిబ్బందిని సైతం అక్కడికి పంపింది. అయితే, ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత ఆర్మీ వైద్య బృందం సహాయక చర్యలు ముగియడంతో భూకంప బాధిత దేశం టర్కీ నుంచి తిరిగి వచ్చింది. 99 మందితో కూడిన వైద్య బృందం హటేలోని ఇస్కెండరున్ లో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించి.. సేవలు అందించింది. తాజాగా ఆ బృందం భారత్ కు చేరుకుంది. భారత్ నుంచి వెళ్లి వచ్చిన చివరి బృందం ఇదే.. అంతకుముందు సహాయకచర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ బృందం తిరిగి దేశానికి చేరుకుంది.

టర్కీ, సిరియా దేశాలలో సేవలందించి తిరిగి స్వదేశానికి వచ్చిన భారత సహాయక బృందాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడ భారత్ నిర్వహించిన సహాయక చర్యలు, చేపట్టిన కార్యక్రమాల గురించి వారితో మాట్లాడి తెలుసుకున్నారు.

ఆర్మీ సిబ్బంది, డాగ్ స్క్యాడ్, అలాగే ఆర్మీ వైద్య సిబ్బంది అందించిన సహాయక చర్యలపై అభినందించారు. భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను కొనియాడారు. టర్కీలో భారత సిబ్బంది సేవలు అజరామరమంటూ అభినందించారు.

వైద్య సిబ్బంది 30 పడకల ఫీల్డ్ ఆసుపత్రిని విజయవంతంగా ఏర్పాటు చేసి, దాదాపు 4,000 మంది రోగులకు చికిత్స చేసిందని అంతకుముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి