Election Schedule: 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ? మార్చి 7 కల్లా ఈసీ ప్రకటించే అవకాశం, ప్రధాని మోదీ వెల్లడి

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల కమిషన్ మార్చి  7 కల్లాతేదీలను   ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోదీ సూచనప్రాయంగా తెలిపారు..

Election Schedule: 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ?  మార్చి 7 కల్లా ఈసీ ప్రకటించే అవకాశం, ప్రధాని మోదీ వెల్లడి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2021 | 2:52 PM

Election Schedule: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల కమిషన్ మార్చి  7 కల్లాతేదీలను   ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోదీ సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మార్చి మొదటివారంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి కూడా తేదీని ఈసీ ప్రకటించవచ్చునన్నారు. 2016 లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను మార్చి 4 న ప్రకటించారని, ఈ ఏడాది బహుశా మార్చి 7 నాటికి  ఈసీ తేదీలను ప్రకటించవచ్చునని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో నిన్న పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. మార్ఛి మొదటివారంలో కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో మోదీ భారీ ర్యాలీ నిర్వహించనున్నారని, ఆ సందర్భంగా బెంగాల్ అసెంబ్లీకి పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ పార్టీ 5 పరివర్తన్ యాత్రలు నిర్వహించింది. ఆరో యాత్ర వచ్ఛే నెల జరగవచ్చునని అంటున్నారు.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తను మరిన్ని విజిట్లు చేయవచ్చునని మోదీ అన్నారు. అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో బాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాన్ని నేను త్వరలో సందర్శిస్తా .. తరచూ కేంద్ర మంత్రులు కూడా ఈ రాష్ట్రాలను విజిట్ చేయవచ్ఛు అన్నారు. అసోంలో 3 వేల కోట్ల వ్యయంతో చేపట్టే మూడు ఇంధన సంబంధ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ధీమాజీలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన..ఇదివరకటి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం వెనుకబడిపోయిందన్నారు. అవి సవతి తల్లి ప్రేమను చూపాయని విమర్శించారు. దశాబ్దాల తరబడి  దేశాన్ని పాలించినవారు ఢిల్లీని, దిశా పూర్ ని దూరం చేశారని, దీనివల్ల ఈ రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని మోదీ పేర్కొన్నారు.

ఢిల్లీ ఇక మీకు ఎంతో దూరంలో లేదు.. మీ ఇంటి తలుపులవద్దే ఢిల్లీ నిల్చుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు పలువురు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తారని ఆయన చెప్పారు. నేను కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను.. ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటా అని ఆయన చెప్పారు. ప్రస్తుతం  ఈ రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వాన్ని మరింత పటిష్ట పరచవలసి ఉందన్నారు. ప్రజల ఆశీస్సులతో ఇక్కడ అభివృద్ధి వేగంగా జరిగేలా చూస్తామని మోదీ అన్నారు.

Also Read:

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ

Petro Prices: పెట్రోల్ పాపం యూపీఏదైతే.. డీజిల్ స్ట్రోక్ ఎన్డీయేది.. గత ప్రభుత్వాలేం చేశాయో తెలిస్తే షాకే!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..