‘పీఎం కేర్స్ ఫండ్ కి 5 రోజుల్లో ఇన్ని కోట్లా’ ? పి. చిదంబరం ‘ఆశ్చర్యం’ !

Umakanth Rao

Umakanth Rao | Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 02, 2020 | 8:22 PM

పీఎం కేర్స్ ఫండ్ కి 5 రోజుల్లో రూ. 3,076 కోట్లు వఛ్చి చేరాయని, ఆ విరాళాలు ఇఛ్చినవారి పేర్లను ఎందుకు వెల్లడించడంలేదని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. పీఎం కేర్స్ ఫండ్ వెబ్ సైట్ లో 2020 ఆర్ధిక సంవత్సరానికి..

'పీఎం కేర్స్ ఫండ్ కి 5 రోజుల్లో ఇన్ని కోట్లా' ? పి. చిదంబరం 'ఆశ్చర్యం' !

పీఎం కేర్స్ ఫండ్ కి 5 రోజుల్లో రూ. 3,076 కోట్లు వఛ్చి చేరాయని, ఆ విరాళాలు ఇఛ్చినవారి పేర్లను ఎందుకు వెల్లడించడంలేదని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. పీఎం కేర్స్ ఫండ్ వెబ్ సైట్ లో 2020 ఆర్ధిక సంవత్సరానికి గాను మార్చి 27-31 మధ్య మాత్రమే  అందిన విరాళాల వివరాలను పొందుపరిచారని ఆయన పేర్కొన్నారు. ఈ 3.076 కోట్లు డొమెస్టిక్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ కాగా-రూ. 39. 67 లక్షలు విదేశీ విరాళాలని పేర్కొన్నారని ఆయన తెలిపారు. అడిట్ స్టేట్ మెంట్ ని అప్ లోడ్ చేసినప్పటికీ, దీనికి జోడించిన ఒకటి నుంచి ఆరు నోట్ ల వివరాలు ఎందుకు బహిర్గతం చేయడంలేదన్నారు. ఇంత ‘ఉదారంగా డొనేషన్స్’ ఇఛ్చినవారిని ఎందుకు ‘దాస్తున్నారని’ ఆయన ట్వీట్ చేశారు. ప్రతి ట్రస్ట్ కూడా డోనర్ల పేర్లను వెల్లడించాల్సి ఉంటుందన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu