Corona Mask: మాస్క్‌ లేకుండా పట్టుబడిలో 5 వేల రూపాయల జరిమానా.. కఠినంగా వ్యవహరిస్తున్న ఆ ప్రభుత్వం

Corona Mask: దేశంలో కరోనా తీవ్రతరం అవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. చాపకింద నీరులా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిలో భాగంగా..

Corona Mask: మాస్క్‌ లేకుండా పట్టుబడిలో 5 వేల రూపాయల జరిమానా.. కఠినంగా వ్యవహరిస్తున్న ఆ ప్రభుత్వం
Corona Mask
Follow us

|

Updated on: Apr 09, 2021 | 10:02 PM

Corona Mask: దేశంలో కరోనా తీవ్రతరం అవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. చాపకింద నీరులా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిలో భాగంగా ఒడిశా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు కఠినమైన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా మాస్క్‌ ధరించని వారిపై భారీగా జరిమానా విధిస్తోంది. తొలిసారి, రెండో సారి మాస్క్‌ ధరించకపోతే రూ.2వేలు, అదే తప్పు మళ్లీ చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరో వైపు ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి దేశంలోని ఎక్కడి నుంచైనా ఒడిశాకు వచ్చే ప్రయాణికులు ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి అని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే స్పష్టం చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న నివేదిక లేదా టీకా వేయించుకున్నట్లు ధృవీకరణ పత్రం చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒక వేళ ఎవరైనా సరైన పత్రాలు చూపించకపోతే ఏడు రోజులు క్వారంటైన్‌ తప్పనిసరి పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఒడిశాలో ఇప్పటి వరకు 3 ,45,526కు చేరగా, మరణాలు 3,38,900లకుపైగా చేరాయి.

ఇప్పటికే మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించేలా ఆలోచనలు చేస్తున్నాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనాపై లెక్కలు బయటపెడుతున్నాయి. వైరస్‌లో మార్పుల (మ్యుటేషన్ల) కారణంగా దాని వ్యాప్తి గతంలో కంటే మరింత తీవ్ర స్థాయిలో పెరిగింది. భారత్‌లో గత ఏడాది మొదటి వేవ్‌లో కేసులు తారస్థాయికి చేరడానికి ఏడు నెలల సమయం పడితే.. సెకండ్‌ వేవ్‌ కేవలం రెండు నెలల్లోనే కేసులు ఆ స్థాయికి చేరుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

సెకండ్‌ వేవ్‌లో గత వారంలో భారత్‌లో 5.13 లక్షల కేసులు నమోదు కాగా, అదే వారంలో 3,071 మరణాలు సంభవించాయి. మొదటి వేవ్‌ తీవ్రత సమయంలో ఎలాంటి భయానక పరిస్థితి ఉందో ఇప్పుడు అలాంటి తీవ్రతే ఉందని డబ్ల్యూహెచ్ వో చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి: Coronavirus: ఫస్ట్‌వేవ్‌లో కేసులు తీవ్ర స్థాయికి చేరేందుకు ఏడు నెలలు పడితే.. సెకండ్‌ వేవ్‌లో రెండు నెలలే : WHO

Covid-19: కరోనా పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వైద్యులు, వైద్య సిబ్బందికి శుభవార్త

Coronavirus: ఫస్ట్‌వేవ్‌లో కేసులు తీవ్ర స్థాయికి చేరేందుకు ఏడు నెలలు పడితే.. సెకండ్‌ వేవ్‌లో రెండు నెలలే : WHO

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..