AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India to Bharat: మళ్లీ ముదిరిన వివాదం.. ఈసారి ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’

సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ-20 సదస్సు జరగనున్న సంగతి తెలసిందే. అయితే జీ-20 డిన్నర్ మీటింగ్‌ ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మను పేర్కొవడం రాజకీయంగా సంచనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియా పేరు కేంద్ర ప్రభుత్వం మార్చాలని ప్రయత్నిస్తోందటూ విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదం మొదలైంది.

India to Bharat: మళ్లీ ముదిరిన వివాదం.. ఈసారి 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్'
Invitaion
Aravind B
|

Updated on: Sep 06, 2023 | 12:45 PM

Share

సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ-20 సదస్సు జరగనున్న సంగతి తెలసిందే. అయితే జీ-20 డిన్నర్ మీటింగ్‌ ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మను పేర్కొవడం రాజకీయంగా సంచనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియా పేరు కేంద్ర ప్రభుత్వం మార్చాలని ప్రయత్నిస్తోందటూ విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదం మొదలైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏసియన్‌-ఇండియా సమ్మిట్‌, ఈస్ట్‌ ఏసియా సమ్మిట్‌ లకు ప్రధాని మోదీ బుధవారం, గురువారం నాడు వరసగా హాజరుకావాల్సి ఉంది. అయితే ఇందుకోసం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో భారత ప్రధానిని.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌గా పేరు మార్పు చేశారు. దీంతో ఇప్పటికే పేరు మార్పుతో ఉన్న వివాదం మరింత ముదిరినట్లైంది.

20వ ఏసియన్-ఇండియా సమ్మిట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ రెండు పదాలను కూడా ఒకే ప్రకటనలో విడుదల చేయడంతో కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉన్నారో అర్థమవుతుందని చెప్పింది. ఇండియా అనే పేరుతో విపక్షాలు ఏకమయ్యాయని అందుకే బీజేపీ నాయకులు డ్రామా చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా.. జీ-20 డిన్నర్ మీటింగ్ కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు అధికారులు ఆహ్వానాన్ని పంపగా.. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని సంభోదించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించున్నారు. అయితే ఇందులో ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జోరుగా ప్రచారం నడిచింది. ఇదిలా ఉండగా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 28 విపక్ష పార్టీలు ఏకమైన సంగతి తెలిసిందే. అయితే విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం వల్లే.. బీజేపీ దేశం పేరు మారుస్తోందని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమ కూటమి పేరును త్వరలోనే భారత్‌గా పేరు మారుస్తామని పలువురు నాయకులు చెబుతున్నారు.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!