AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కొంగు నాడు’ వివాదం.. తమిళనాడును విభజించే ప్రసక్తి లేదు.. బీజేపీ హైకమాండ్ క్లారిటీ

తమిళనాడును రెండు రాష్ట్రాలుగా విభజించే ప్రసక్తి లేదని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. కొంగు నాడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందంటూ వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ఈ క్లారిటీ ఇస్తూ...

'కొంగు నాడు' వివాదం.. తమిళనాడును విభజించే ప్రసక్తి లేదు.. బీజేపీ హైకమాండ్ క్లారిటీ
Cm Stalin
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 12, 2021 | 8:21 PM

Share

తమిళనాడును రెండు రాష్ట్రాలుగా విభజించే ప్రసక్తి లేదని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. కొంగు నాడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందంటూ వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ఈ క్లారిటీ ఇస్తూ..తమిళనాడును రెండుగా విభజించే యోచనే లేదని తెలిపింది. తమిళనాడు బీజేపీ శాఖకు చెందిన పలువురు నాయకులు ఈ మేరకు అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర కోయంబత్తూరు బీజేపీ శాఖకు చెందిన కార్యకర్తలను పార్టీ నాయకత్వం తీవ్రంగా మందలించింది. కొంగు నాడు డిమాండును అన్నా డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. కొంగునాడుకు చెందిన బీజేపీ ఎంపీ ఎల్.మురుగన్ కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా నియమితులు కావడంతో ఇక రాష్ట్ర విభజన జరుగుతుందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా తమిళ డైలీ ఒకటి ప్రత్యేక రాష్ట్రం అంటూ ఓ వార్తను ప్రచురించింది. దీంతో సీపీఐ, సీపీఎం, ఎండీఎంకె అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దీనిపై బీజేపీ నాయకత్వం క్లారిటీ ఇవ్వాలని కోరాయి.

ధారాపురం, తిరుచెంగోడు, ఈరోడ్, పళని, సేలం, ధర్మపురి, నీలగిరి, సత్యమంగళం, పొలాచ్చి, కోయంబత్తూరు, మరో మూడు, నాలుగు జిల్లాలు కొంగునాడు పరిధిలోకి వస్తాయి. ఈ పశ్చిమ ప్రాంతంలో ఏఐఏడీఎంకె పట్టు ఎక్కువగా ఉంది.. అయితే ప్రత్యేక రాష్ట్రం డిమాండును మాత్రం పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏమైనా ఈ వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఈ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు దుయ్యబట్టాయి. కలలో కూడా ఆ యోచన రాకూడదని డీఎంకే నేత కనిమొళి వ్యాఖ్యానించారు. చివరకు ఇది పెద్ద వివాదం కావడంతో బీజేపీ సోమవారం ఈ వివరణను, క్లారిటీని ఇచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ‘నాపై నిఘా పెడుతున్నారు.’ శివసేన, ఎన్సీపీ లపై .మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ సంచలన ఆరోపణ

India tour of Sri Lanka: ఇట్స్ అఫీషియల్.. ఐదు రోజులు ఆలస్యంగా సిరీస్ రీ-స్టార్ట్.. షెడ్యూల్ ఇదే.!

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ