AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yasin Malik: ఉరిశిక్షా.. యావజ్జీవమా..? మరికాసేపట్లో తీర్పు.. కోర్టు బయట భద్రత పెంపు..

టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో కాశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌మాలిక్‌ ఉరిశిక్షా.. యావజ్జీవమా..? కాసేపట్లో తేలిపోనుంది. టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో యాసిన్‌మాలిక్‌ను దోషిగా తేల్చింది ఎన్‌ఐఏ కోర్టు.

Yasin Malik: ఉరిశిక్షా.. యావజ్జీవమా..? మరికాసేపట్లో తీర్పు.. కోర్టు బయట భద్రత పెంపు..
Yasin Malik
Sanjay Kasula
|

Updated on: May 25, 2022 | 5:08 PM

Share

కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు శిక్షపై ప్రత్యేక NIA కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో నిషేధిత సంస్థ జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్‌కు మరికొద్దిసేపట్లో శిక్ష ఖరారు కానుంది. ఢిల్లీలోని NIA కోర్టు శిక్షకు సంబంధించిన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. యాసిన్ మాలిక్‌కు మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ కోరినట్లు సమాచారం. టెర్రర్ ఫండింగ్ కేసులో అంతకుముందు గురువారం కోర్టు దోషిగా నిర్ధారించింది. ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో యాసిన్‌ మాలిక్‌ సిద్ధహస్తుడని ఎన్‌ఐఏ విచారణలో తేలింది. కోర్టు తీర్పు సందర్భంగా ఢిల్లీతో పాటు కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో యాసిన్ మాలిక్ అంగీకరించాడు. యాసిన్ మాలిక్ తరపు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. అతడి ఆస్తి బయటపడింది. మాలిక్‌కు 11 కెనాల్స్ అంటే దాదాపు 5564 చదరపు మీటర్ల భూమి ఉంది. దానిని అతను పూర్వీకులుగా అభివర్ణించాడు. బుర్హాన్ వనీని హతమార్చినట్లు ప్రకటించినప్పటి నుంచి తాను నిరంతరాయంగా జైల్లోనే ఉన్నట్లుగా తెలిపాడు. అలాంటప్పుడు తనపై వస్తున్న ఈ ఆరోపణలు ఎలా వచ్చాయని కోర్టులో యాసిన్ జడ్జితో విన్నవించకున్నాడు. దీనిపై కోర్టు ఇప్పుడు సమయం కాదని చెప్పింది. అదే సమయంలో, దీనికి యాసిన్ బదులిస్తూ.. ‘మీకు ఏది సరైనదనిపిస్తే అది శిక్షించమని మిమ్మల్ని వేడుకోంటున్నా.. కానీ నేను ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చాను అని అలాంటి సాక్ష్యం ఏమైనా ఉంటే చూడండి? అంటూ కోర్టులో తన వాదనలను వినిపించాడు.

వాస్తవానికి, యాసిన్ మాలిక్‌పై నేరపూరిత కుట్ర, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, కాశ్మీర్ శాంతికి భంగం కలిగించడం వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనడం వంటి సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయబడ్డాయి. యాసిన్ మాలిక్ కూడా ఈ ఆరోపణలను కోర్టు ముందు అంగీకరించారు, ఆ తర్వాత మే 19న కోర్టు యాసిన్ మాలిక్‌ను దోషిగా నిర్ధారించింది.

యాసిన్ మాలిక్‌పై యూఏపీఏ సెక్షన్

యాసిన్ మాలిక్‌పై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సెక్షన్-16 (ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినది), సెక్షన్-17 (ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సేకరణ), సెక్షన్-18 (ఉగ్రవాద చర్యకు కుట్ర), సెక్షన్ 20 (ఉగ్రవాది సమూహం లేదా సంస్థలో సభ్యుడు కావడం ) మరియు సెక్షన్లు 120B అంటే నేరపూరిత కుట్ర, 124A అంటే దేశద్రోహం మరియు IPCలోని ఇతర సెక్షన్ల కింద. గత విచారణ సమయంలోనే యాసిన్ మాలిక్ కోర్టు ముందు ఆరోపణలను అంగీకరించారు.

యాసిన్‌తో పాటు ఈ వేర్పాటువాద నేతలపై అభియోగాలు మోపారు

యాసిన్ మాలిక్‌తో పాటు షబీర్ షా, మసరత్ ఆలం, ఫరూఖ్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే, మహ్మద్ అక్బర్ ఖండే, రాజా మెహ్రాజుద్దీన్ కల్వాల్, బషీర్ అహ్మద్ భట్, మహ్మద్ యూసుఫ్ షా, అఫ్తాబ్ అహ్మద్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయీమ్ ఖాన్, జహోర్‌లను కూడా కోర్టు ఆదేశించింది. షబ్బీర్ అహ్మద్ షా, అబ్దుల్ రషీద్ షేక్ సహా ఇతర కాశ్మీరీ వేర్పాటువాద నాయకులపై ఈ అభియోగాలు మోపబడ్డాయి. దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన చార్జిషీట్‌లో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ పేర్లు కూడా ఉన్నాయి .