AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వామ్మో! ఎలక్ట్రిక్ మెషిన్ల చాటున చీకటి ఎవ్వారం.. అధికారులు చెక్ చేయగా మైండ్ బ్లాంక్..

పంచ్ డైలాగుల ప్రభావం అటుంచితే.. సినిమాల ప్రభావం అందరిపై బాగా పడిందని తెలుస్తోంది. ఇక్కడ ఓ ఇద్దరు వ్యక్తులు తెలివిగా..

Viral: వామ్మో! ఎలక్ట్రిక్ మెషిన్ల చాటున చీకటి ఎవ్వారం.. అధికారులు చెక్ చేయగా మైండ్ బ్లాంక్..
1
Ravi Kiran
|

Updated on: May 25, 2022 | 5:21 PM

Share

గోల్డ్‌కు ఇండియాలో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది స్మగ్లర్లు దీనిని అక్రమ వ్యాపారంగా ఎంచుకుని.. దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి రకరకాల పద్దతుల్లో పసిడి దేశంలోకి వస్తుంది. ఇక అలా వచ్చిన గోల్డ్‌ను స్మగ్లర్లు ప్రభుత్వ సుంకానికి ఎగనామం పెట్టి.. బంగారం అధికంగా వినియోగించే ప్రదేశాలకు సరఫరా చేస్తుంటారు. తాజాగా విదేశాల నుంచి బంగారాన్ని దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు స్మగ్లర్లను ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ సిండికేట్‌లోని సభ్యులైన ఈ ఇద్దరి దగ్గర నుంచి సుమారు 7.39 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ముందుగా అందిన పకడ్బందీ సమాచారంతోనే డీఆర్ఐ అధికారులు.. ముంబై విమానాశ్రయంలో స్మగ్లర్ల కోసం మాటు వేశారు. హాంకాంగ్ నుంచి వచ్చిన కార్గోలో స్మగ్లర్లు బంగారాన్ని దాచిపెట్టారని తెలుసుకున్న అధికారులు.. ఆ విమానంలో వచ్చిన ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే వారికి ఇద్దరిపై అనుమానం రావడంతో.. సదరు వ్యక్తుల దగ్గర ఉన్న లగేజీని చెక్ చేయగా.. అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దాదాపుగా 30 ఎలక్ట్రిక్ బ్రేకర్ మెషిన్ల సిలిండరికల్ లోబ్స్‌లో ఆ వ్యక్తులు బంగారాన్ని అమర్చిన తీరుకు అధికారులు షాక్ అయ్యారు. దీనితో కస్టమ్స్ క్లియరెన్స్ ద్వారా బంగారాన్ని ఎయిర్‌పోర్ట్ దాటించాలనుకున్న స్మగ్లర్ల ప్లాన్‌కు అధికారులు తెలివిగా చెక్ పెట్టినట్లు అయింది.