AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Crisis: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. నూతన ఏడాది వేడుకలపై ఆంక్షలు.. ఎక్కడంటే?

New Year Celebration: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో, కొత్త సంవత్సరంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా చూసేందుకు రాష్ట్రంలోని అన్ని పార్కులు..

Omicron Crisis: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. నూతన ఏడాది వేడుకలపై ఆంక్షలు.. ఎక్కడంటే?
తూర్పు మద్య దేశాలు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో కేసుల సంఖ్య గతం వారంతో పోలిస్తే సమానంగా ఉంది. అటు ఆఫ్రికన్ ప్రాంతంలో మాత్రం మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఏకంగా 72 శాతం మరణాలు సంభవించాయి. అటు దక్షిణ తూర్పు ఆసియాలో 9 శాతం మరణాలుంటే..అమెరికా ప్రాంతంలో 7 శాతం మరణాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల కోవిడ్ కేసులుంటే..5.4 మిలియన్ల మంది మరణించారు.
Venkata Chari
|

Updated on: Dec 29, 2021 | 5:52 AM

Share

Omicron Cases In India: దేశవ్యాప్తంగా కోవిడ్ ముప్పు పెరుగుతున్న దృష్ట్యా, తాజాగా బీహార్ ప్రభుత్వం కూడా కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ కారణంగా, కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి బీహార్ రాష్ట్ర హోం శాఖ నూతన ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వు ప్రకారం, బీహార్‌లోని అన్ని పార్కులు, బయోలాజికల్ పార్కులు డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు మూసివేయనున్నారు. అదే సమయంలో, బీహార్ ప్రజలు ప్రతి బహిరంగ ప్రదేశంలో కోవిడ్-19 ప్రోటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల వినియోగం తప్పనిసరి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయని, ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ, ఈ కొత్త ఆందోళన గురించి హెచ్చరించి, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల మేరకు, ఈ వేరియంట్ వ్యాప్తిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కరోనా కేసుల ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి 7.30 గంటలకు ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, గత 24 గంటల్లో 496 కేసులు వెలుగుచూశాయి. దీని తర్వాత ఇన్ఫెక్షన్ రేటు 0.89 శాతానికి పెరిగింది. నిన్న 331 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా ఇన్ఫెక్షన్ రేటు 0.68 శాతంగా ఉంది.

ఈ వేరియంట్‌తో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు కోవిడ్ అతితక్కువ లక్షణాలను కలిగి ఉన్నారు. ఈ వైరస్ ఎక్కువగా కోవిడ్ రెండు మోతాదులను తీసుకున్న వ్యక్తులకు కూడా సోకుతుంది. అందుకే రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు.

Also Read: Work From Home: కరోనా మహమ్మారితో కంపెనీలు కీలక నిర్ణయం.. శాశ్వతంగా ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌!

Doctors protesting: ముదిరిన పీజీ నీట్‌ కౌన్సిలింగ్‌.. పోలీసుల ప్రవర్తనపై రెసిడెంట్‌ డాక్టర్ల ఆగ్రహం