కరోనా డబుల్ మ్యూటేషన్‌లో మళ్లీ కొత్త వేరియేషన్..! ఇప్పుడు మునపటి కంటే చాలా డేంజర్ : సీసీఎంబీ

Corona Double Mutation : భారతదేశంతో సహా ప్రపంచంలోని 17 దేశాలకు వ్యాపించిన కరోనా డబుల్ మ్యుటేషన్ రకం B.1.617 దాని రూపాన్ని మళ్లీ

కరోనా డబుల్ మ్యూటేషన్‌లో మళ్లీ కొత్త వేరియేషన్..! ఇప్పుడు మునపటి కంటే చాలా డేంజర్ : సీసీఎంబీ
Corona Double Mutation
Follow us

|

Updated on: May 09, 2021 | 11:31 AM

Corona Double Mutation : భారతదేశంతో సహా ప్రపంచంలోని 17 దేశాలకు వ్యాపించిన కరోనా డబుల్ మ్యుటేషన్ రకం B.1.617 దాని రూపాన్ని మళ్లీ మార్చింది. ఇది మునుపటి కంటే చాలా డేంజర్‌గా మారిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భారతదేశం, బ్రిటన్, స్పెయిన్లలో ఈ రకం ఫార్మాట్‌లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. కొత్త రకం బి.1.617.2. వేరియెంట్‌లో కొన్ని కొత్త మార్పులు గుర్తించారని వాటికోసం వైద్య నిపుణులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు.

రెండు ప్రధాన ఉత్పరివర్తనలు L452R, E484Q 617 లో నమోదు చేయబడ్డాయన్నారు. కానీ ఇప్పుడు E484Q దాని నుంచి కనుమరుగైందని పేర్కొన్నారు. అయితే ఇతర మార్పులను అర్థం చేసుకోవడానికి అధ్యయనాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ రకం వైరస్ బలహీనపడిందా లేదా బలపడిందా అని అడిగినప్పుడు? ఇది ఖచ్చితంగా బలపడిందన్నారు. అందుకే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. సిసిఎంబిలో జీనోమ్ సీక్వెన్సింగ్‌లో కొత్త తరహా కేసులు దొరికాయని తెలిపారు. వాటిని లోతుగా అధ్యయనం చేస్తున్నారన్నారు.

డబుల్ మ్యుటేషన్ వేరియంట్ కొత్త వెర్షన్‌ను పున రూపకల్పన చేస్తూ బ్రిటన్ దీనిని VUI-21APR-02 గా గుర్తించిందని, అయితే భారతదేశంలో దీనిని B.1.617.2 గా సూచిస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్ వేగంగా మారుతోందని, ప్రపంచంలో ఇప్పటివరకు వందలాది మార్పులు నమోదయ్యాయని తెలిపారు. ప్రతి నెలా వైరస్‌లో రెండు మార్పులు సంభవిస్తున్నాయన్నారు. అయితే ఈ మార్పులలో కొన్ని చాలా ప్రాణాంతకమైనవని రాకేశ్ మిశ్రా ఈ సందర్భంగా గుర్తుచేశారు.

దేశంలో ఐదోసారి 4 లక్షల కొత్త కేసులు, 4 వేలకు పైగా మరణాలు, నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 4133 మంది మరణించారు. అదే సమయంలో 4,09,300 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,42,398 మంది మరణించారు. కాగా ఇప్పటివరకు 2,22,95,911 మందికి కరోనా సోకింది.

బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ ఆందోళన, డీజీపీ సహా ఉన్నతాధికారులకు పిలుపు

CORONA SECOND WAVE: ఆ పన్నెండు రాష్ట్రాల్లోనే అదుపుతప్పుతున్న కరోనా.. 80శాతం కేసులు అక్కడే!

బరువు తగ్గడానికి జీలకర్ర టీని తాగండి..! చాలా తొందరగా ప్రభావం చూపుతుంది.. ట్రై చేసి చూడండి..

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌