AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucknow: Lucknow: విమానాశ్రయంలో కార్గో లగేజీ స్కానింగ్ చేయగా..బీప్ బీప్ అని సౌండ్..ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!

ఎప్పటిలాగే లక్నో ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో సిబ్బంది మంగళవారం కార్గో కోసం బుక్ చేయాల్సిన లగేజీని స్కాన్ చేస్తున్నారు. ఇంతలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కొరియర్ ఏజెంట్ కార్గో ద్వారా సరుకులు బుక్ చేసుకునేందుకు వచ్చాడు. బుక్ చేసిన లగేజీని కార్గో సిబ్బంది స్కాన్ చేయగా ప్లాస్టిక్ బాక్సులో నవజాత శిశువు మృతదేహం కనిపించింది.

Lucknow: Lucknow: విమానాశ్రయంలో కార్గో లగేజీ స్కానింగ్ చేయగా..బీప్ బీప్ అని సౌండ్..ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!
New Born Dead Body Found In Lucknow Airport Uttar Pradesh
Velpula Bharath Rao
|

Updated on: Dec 03, 2024 | 10:47 PM

Share

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో లగేజీలో స్కానింగ్‌లో నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. విమానాశ్రయానికి కొరియర్‌కు వచ్చిన ఓ ఏజెంట్ లగేజీ పెట్టెలో అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన కార్గో కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే కార్గో సిబ్బంది సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు. దీంతో పాటు కొరియర్ కోసం వచ్చిన యువకుడిని పట్టుకుని సీఐఎస్ఎఫ్ జవాన్లకు అప్పగించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ యువకుడిని విచారించగా.. మృతదేహం గురించి ఏమీ చెప్పలేకపోయాడు.

ఎప్పటిలాగే లక్నో ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో సిబ్బంది మంగళవారం కార్గో కోసం బుక్ చేస్తున్న వస్తువులను స్కాన్ చేస్తున్నారు. ఇంతలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కొరియర్ ఏజెంట్ కార్గో ద్వారా సరుకులు బుక్ చేసుకునేందుకు వచ్చాడు. బుక్ చేసిన లగేజీని కార్గో సిబ్బంది స్కాన్ చేయగా ప్లాస్టిక్ బాక్సులో నవజాత శిశువు మృతదేహం కనిపించింది. ఇది చూసిన కార్గో ఉద్యోగులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటనపై వెంటనే సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు.

కొరియర్ కోసం వచ్చిన ఉద్యోగిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించగా, కొరియర్ కోసం సరుకులు తీసుకొచ్చిన యువకుడు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోయాడు. అయితే నవజాత శిశువు మృతదేహం ఉన్న పెట్టెను ముంబైకి పంపించాల్సి ఉంది, అయితే కొరియర్ ఏజెంట్ వద్ద ఎటువంటి పేపర్లు దొరకలేదు.
ప్రస్తుతం ఆ కంపార్ట్‌మెంట్‌లో దొరికిన మృతదేహం గురించి కొరియర్ కంపెనీ ఉద్యోగి ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోయాడు. లక్నో ఎయిర్‌పోర్ట్ కార్గో కాంప్లెక్స్‌లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కొరియర్ కోసం వచ్చిన వ్యక్తిని పోెలీసులు విచారిస్తున్నారు. పార్శిల్‌ను ముంబైకి పంపిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే కొరియర్ ఏజెంట్ దానిని విమానంలో పంపడానికి ఎటువంటి పత్రాలను చూపించలేకపోయాడు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి